mudragada

మళ్లీ వార్తల్లోకి వచ్చిన ముద్రగడ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లో నిలిచాడు. అప్పట్లో ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచినా ఈయన..ఫలితాల దెబ్బకు అడ్రెస్ లేకుండా పోయాడు. మళ్లీ ఇన్ని నెలలకు మరోసారి లేఖలు రాస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈసారి సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. అలాగే రెడ్‌బుక్‌ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా కేసులను ప్రధానంగా చూపుతూ లేఖలో పేర్కొన్నారు.

ఈరోజు (శుక్రవారం) సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ముద్రగడ లేఖను విడుదల చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు. సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ పద్మనాభం సూక్తులు చెబుతూ లేఖ రాశారు.

Related Posts
కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ “షాప్ అండ్ విన్ కార్” ఆఫర్
Kisna Diamond & Gold Jewelery brings joy with its Shop and Win Car offer

గుంటూరు : భారతీయ ఆభరణాల పరిశ్రమలో సుప్రసిద్ధమైన హరి కృష్ణ గ్రూప్ యొక్క ప్రముఖ బ్రాండ్ అయిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ , సత్తెనపల్లిలోని Read more

మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
Vijayawada West Bypass unde

విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉన్న వెస్ట్ బైపాస్ రహదారి పూర్తి కావొస్తుంది. ప్రస్తుతం 95% పనులు పూర్తవగా, మిగిలిన పనులు త్వరలోనే Read more

Cows : గోమాతల్లో పవర్ ఉంటుంది : పంజాబ్ గవర్నర్
Cows గోమాతల్లో పవర్ ఉంటుంది పంజాబ్ గవర్నర్

Cows : గోమాతల్లో పవర్ ఉంటుంది : పంజాబ్ గవర్నర్ పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గో సంరక్షణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోమాతల్లో Read more

దావోస్ లో చంద్రబాబు రేవంత్ భేటీ
దావోస్ లో చంద్రబాబు రేవంత్ భేటీ

తెలుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోటీని మరింత ప్రోత్సహిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు Read more