CM Yogi Adityanath counters Mallikarjun Kharge comments

మల్లిఖర్జున ఖర్గే వ్యాఖ్యలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్‌

న్యూఢిల్లీ: సన్యాసులు రాజకీయాల్లోంచి తప్పుకోవాలని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖర్జున వ్యాఖ్యనించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘బాటేంగేతో కాటేంగే’ అంటే మీకు కోపం వస్తోంది కదా? దాన్ని నాపై కాదు హైదరాబాద్ నిజాంపై చూపించండి. రజకార్లు మీ ఊరిని తగలబెట్టారు. హిందువుల్ని దారుణంగా చంపారు. మీ తల్లిని, చెల్లిని,మీ కుటుంబీకుల్ని దారుణంగా చంపేశారు. (కులాలుగా)విడిపోతే జరిగే నష్టమిదే. ఓటు బ్యాంకు కోసం దాన్ని మీరు మర్చిపోయినట్టు ఉన్నారు’ అంటూ యోగి కౌంటర్ ఇచ్చారు.

గతంలో హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనలో హిందువులపై జరిగిన దాడుల్లు మల్లికార్జున ఖర్గే తల్లి సహా కుటుంబ సభ్యులు మొత్తం చనిపోయిన విషయాన్ని యోగి గుర్తు చేశారు. ఇప్పుడు ఓట్ల కోసమే ఆయన తన కుటుంబం చేసిన త్యాగాన్ని మర్చిపోయారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకపోతే..భారతీయులంతా కులాల వారీగా, మతాల వారీగా విడిపోతే దేశం ముక్కలు అవుతుందని తప్పా జాతి అభివృద్ధి సాధ్యం కాదని పలువురు సీనియర్ పొలిటికల్ నేతలు సైతం హెచ్చరిస్తున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అమరావతిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్.. మల్లికార్జున ఖర్గే లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే చిన్నతనంలో జరిగిన ఓ విషాద సంఘటనను గుర్తు చేశారు. మన దేశంలో బ్రిటీష్‌ పాలన కొనసాగుతున్న సమయంలో హైదరాబాద్‌ సంస్థానం నిజాం రాజుల పాలనలో ఉండేది. అయితే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న మల్లికార్జున ఖర్గే పూర్వీకుల గ్రామం.. హైదరాబాద్ సంస్థానంలోనే నిజాం రాజుల ఆధీనంలో ఉండేది. నిజాం పాలకుల సమయంలో హిందువులే లక్ష్యంగా తీవ్రమైన దాడులు జరిగేవని గుర్తు చేశారు. అప్పుడు జరిగిన అగ్ని ప్రమాదంలో మల్లికార్జున ఖర్గే ఇల్లు పూర్తిగా కాలిపోయిందని పేర్కొన్న యోగి.. ఆ ఘటనలో ఖర్గే తల్లి సహా కుటుంబ సభ్యులంతా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

Related Posts
నేటి నుంచి ఒంటిపూట బడులు
school holiday 942 1739263981

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు ఒంటిపూట బడులను ప్రకటించాయి. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు మధ్యాహ్నం తీవ్ర Read more

ఢిల్లీ ఎన్నికలు – జోరుగా బెట్టింగ్ లు
rahul modi kejriwal

చాలా కాలం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు హోరీహోరీగా జరుగుతున్నాయి. వరుసగా మూడుసార్లు గెలిచి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి విపక్ష బీజేపీ నుంచి గట్టి Read more

టెస్లా ప్రతినిధులతో నారా లోకేష్‌ సమావేశం
lokesh busy us

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో Read more

రూ.89 వేలు దాటిన బంగారం ధరలు
రూ.89 వేలు దాటిన బంగారం ధరలు

గత కొద్దిరోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేవలం నిన్న శుక్రవారం రోజున స్థానిక బులియన్ మార్కెట్లో బంగారం ధర రూ.1,300 పెరిగి 10 గ్రాములకు రూ.89,400 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *