మను భాకర్ డబుల్ ఒలింపిక్ పతక విజేతకు ఖేల్ రత్న నామినీల జాబితాలో లేదు
ఈ ఏడాది ప్రారంభంలో పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లభించకపోవడం వివాదాస్పదంగా మారింది. జాతీయ క్రీడా అవార్డు కమిటీ ఆమె పేరును సిఫారసు చేయకపోవడంతో, ఆమె తండ్రి రామకృష్ణ భాకర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
మను భాకర్ అవార్డు కోసం దరఖాస్తు చేయలేదని క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొన్నప్పటికీ, ఆమె తండ్రి రామకృష్ణ, “మేము దరఖాస్తు చేసుకున్నాం, కానీ కమిటీ నుండి ఏ ప్రతిస్పందన రాలేదు” అని వ్యాఖ్యానించారు. “ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించినా, అవార్డుల కోసం అడగాల్సి వస్తే దానిలో అర్థమేంటి?” అని ప్రశ్నించారు.
మహమ్మద్ షమీకు అవార్డు – వివక్షత అనుమానం
మను భాకర్కు అవార్డు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, క్రికెటర్ మహమ్మద్ షమీ అర్జున అవార్డు పొందడం గమనార్హం. షమీ తాను దరఖాస్తు చేయకపోయినప్పటికీ, బీసీసీఐ జోక్యం చేసుకోవడంతో ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. ఈ పరిణామం క్రీడలలో అసమానతలపై ప్రశ్నలు లేవనెత్తింది.
మను భాకర్ డబుల్ ఒలింపిక్ విజేతకు ఖేల్ రత్న లేదు
మను భాకర్ పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలను గెలుచుకుని భారత ఒలింపిక్ చరిత్రలో తన పేరును చెరగని ముద్ర వేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మరియు మిక్స్డ్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి పతకాలను సాధించింది.
టోక్యో ఒలింపిక్స్లో భారత షూటింగ్ టీమ్ వైఫల్యం తర్వాత, మను పారిస్లో విజయంతో సత్తా చాటింది. సోషల్ మీడియా విమర్శకులకు కఠినమైన సమాధానాలిచ్చి, ఒలింపిక్ పతకాలతో గర్వంగా నిలిచింది.