wine shop

మందుప్రియులకు కొత్త సంవత్సరం కానుక

మందుప్రియులకు ఏపీ కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఎక్సైజ్ విధానం తీసుకువచ్చాక ప్రైవేటుకు మద్యం షాపులు అప్పగించినా ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువగా అమ్మకుండా కట్టడి చేయడం, పాత బ్రాండ్లన్నీ తిరిగి తీసుకురావడం, 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ మద్యం వంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్భంగా మరో శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఇవాళ, రేపు మద్యం షాపుల్ని అర్ధరాత్రి 12 గంటల వరకూ, బార్లను అర్ధరాత్రి ఒంటి గంట వరకూ తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు మద్యం షాపులు, బార్ల యజమానులకు అనుమతి ఇస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త సంవత్సర వేడుకలు చేసుకునే వారు ఆయా సమయాల వరకూ అక్కడికి వెళ్లి మద్యం తెచ్చుకోవడం లేదా అక్కడే తాగేందుకు అనుమతి లభించనుంది.


కొత్త ఏడాది సందర్భంగా ఇవాళ, రేపు రాష్ట్రంలో మద్యం షాపుల్లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. పార్టీలు, వేడుకలు చేసుకునే వారితో పాటు వ్యక్తిగతంగా కూడా ఇంటికి మద్యం తెచ్చుకుని తాగే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మద్యం షాపుల్ని, బార్లను కూడా అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచేలా ప్రభుత్వం ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

సర్కార్ కు భారీ ఆదాయం
ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి కొత్త ఎక్సైజ్ విధానం తెచ్చాక 75 రోజుల్లోనే ఏకంగా 6,312 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ 75 రోజుల్లో మొత్తం 26 లక్షల 78 వేల 547 బీర్లు అమ్ముడైనట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే 83 లక్షల 74 వేల 116 కేసుల మద్యం అమ్ముడైనట్లు వెల్లడించింది.

Related Posts
దస్తగిరికి మరింత భద్రత పెంపు ఎందుకంటే
దస్తగిరికి మరింత భద్రత పెంపు ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి సాక్షులు వరుసగా అనుమానాస్పద రీతిలో మృతి చెందడం సంచలనం Read more

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈనెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇవాళ ఉదయం 9 Read more

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం..సిట్ దర్యాప్తు ప్రారంభం
Tirumala Srivari Laddu case.SIT investigation begins

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిన శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ వ్యవహారంలో విచారణ ప్రారంభమైంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ Read more

అమరావతి నిర్మాణానికి రూ. 2,723 కోట్ల పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్
chandrababu

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు Read more