visa

భారతీయులకు జో బైడెన్ శుభవార్త

ట్రంప్ ఎన్నికలో గెలిచి, జనవరిలో కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న తరుణంలో వీసాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆందోనళ చెందే వారికీ జో బైడెన్ శుభవార్త చెప్పింది. అమెరికా వెళ్లాలని, అక్కడ ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జో బైడెన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ నిపుణులను మరింత సులభంగా నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది. అలాగే, ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా లక్షలాదిమంది భారతీయ ప్రొఫెషనల్స్‌కు ప్రయోజనం చేకూరనుంది.
భారత్, చైనా దేశాలు భారీగా లబ్ధి
అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసా (నాన్ ఇమిగ్రెంట్) సాయంతో విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. ఈ వీసా ద్వారా భారత్, చైనా దేశాలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నిబంధనల్లో మార్పులు చేసి అవసరాలకు తగ్గట్టుగా విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పించింది.
ఈ కొత్త విధానంలో లేబర్ కండిషన్ అప్లకేషన్ కచ్చితంగా హెచ్-1బీ వీసా పిటిషన్‌కు అనుగుణంగా ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. తాజా మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకునే అవకాశం యజమానులకు లభిస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెంజాడ్రో ఎన్ మేయోర్కాస్ తెలిపారు.

Related Posts
ఎల్ఐసి కస్టమర్లు జాగ్రత్త..!
lic

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఆర్ధిక మోసాలు కూడా అదే రీతిలో పెరిగాయి. వీటి వల్ల ఎక్కువగా మోసపోయేది కూడా సామాన్యులే. తాజాగా దీనికి సంబంధించి LIC Read more

ట్రంప్ టారిఫ్ పెంపు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని సూచిస్తుందా?
ట్రంప్ టారిఫ్ పెంపు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని సూచిస్తుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా, మెక్సికో, మరియు చైనాలపై సుంకాల పెంపుదల శనివారం సాయంత్రం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ ప్రకటనతో వైట్ హౌస్ నుండి ఇతర Read more

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విజయ్
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విజయ్

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విజయ్ నిజంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల Read more

తెలంగాణకు నీళ్లు ఇవ్వని రేవంత్.. ఆంధ్రకు ఇస్తున్నాడు : హరీశ్ రావు
Another case against former minister Harish Rao

ఆంధ్రకు నీళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకుంటున్నా స్పందించడం లేదని Read more