Five year old Aryan

బోరుబావిలో పడ్డ బాలుడు మృతి

రాజస్థాన్ , డిసెంబర్ 12,బోరుబావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు రెండు రోజులుగా అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. విషాదకర సంఘటనగా మిగిలిపోయిన బాలుడి ఉదంతం రాజస్థాన్ లో జరిగింది. దీనికి సంబందించి పూర్తి వివరాలు..గత రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ బాలుడి ప్రాణాలను కాపాడేందుకు అధికారులు విశ్వాప్రయత్నాలు చేసారు. ప్రమాదవశాత్తు 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడుని 56 గంటల తర్వాత బయటకు తీసినప్పటికీ, ప్రాణాలు మాత్రం దక్కలేదు. రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిందీ ఘటన.

మూడు రోజుల క్రితం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆర్యన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. గంట తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. పైపు ద్వారా ఆక్సిజన్‌ను లోపలికి పంపారు. బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు లోపలికి కెమెరాను కూడా పంపారు. ఎస్‌డీఆర్ఎఫ్‌తోపాటు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. బోరుబావిలో చిక్కుకుపోయిన బాలుడు ఆర్యన్‌ను రక్షించేందుకు రెండ్రోజులపాటు చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించినప్పటికీ బాలుడి ప్రాణాలు మాత్రం దక్కలేదు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని తాడు సాయంతో బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

నీటి కోసం బోరుబావి తీసినపుడు అందులో నీరు రాకపోతే వెంటనే వాటిని పూడ్చివేయాలని కోర్టులు ఎన్నిసార్లు ఆజ్ఞాపించిన ప్రజల్లో చేంజ్ రావడం లేదు. తాజాగా రాజస్థాన్ లోని ఆర్యన్ మరణించాడు.ఆర్యన్ ను రక్షించేందుకు అధికారులు బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వారు. అయితే, డ్రిల్లింగ్ మెషీన్ పాడవడం, 160 అడుగుల లోతులో నీరు పడే అవకాశం ఉండడంతో బాలుడిని రక్షించేందుకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. ఇంకా తవ్వుకుంటూ పోతే బాలుడిపై మట్టిపెళ్లలు పడే అవకాశం ఉండడంతో చివరికి బాలుడి చుట్టూ తాడు కట్టి జాగ్రత్తగా బయటకు లాగారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఈసంఘటతోనైనా మనము మార్పు చెందుదాం.

Related Posts
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
national consumers day

డిసెంబర్ 24 రోజును జాతీయ వినియోగదారుల హక్కుల రోజు గా ప్రకటించి, వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌డం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి వ్యక్తి ఒక Read more

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన మహిళా సిబ్బంది
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన మహిళా సిబ్బంది

భారతీయ రైల్వే చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం లిఖించబడింది. మొట్టమొదటిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును పూర్తిగా మహిళా సిబ్బందితో నడిపి, నారీశక్తి సామర్థ్యాన్ని రైల్వే శాఖ సగర్వంగా Read more

ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ
Rahul Gandhi met MPs

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న Read more

డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఊరట..2020 నాటి ఎన్నికల కేసు కొట్టివేత
Relief for Donald Trump.Dismissal of 2020 election case

న్యూయార్క్‌: డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఊరట లభించింది. ఆయనపై ఉన్న రెండు క్రిమినల్‌ కేసులను కోర్టు కొట్టివేసింది. రహస్యపత్రాలను తన దగ్గరే ఉంచుకున్న కేసుతోపాటు 2020ఎన్నికల్లో ఓటమిని తిప్పికొట్టే Read more