bus driver heart attack

బస్సు నడుపుతుండగా.. డ్రైవర్‌కు గుండెపోటు..ప్రయాణికులను కాపాడిన కండక్టర్

ఇటీవల గుండెపోటు అనేది వయసు సంబంధం లేకుండా వస్తున్నాయి. అప్పటి వరకు సంతోషం తన పని తాను చేసుకుంటుండగా..సడెన్ గా కుప్పకూలి మరణిస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తుల వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోతూ కనిపించారు. మరొక వీడియోలో చేతిలో పూలు పట్టుకొని కనిపిస్తున్న పెళ్లి కూతురు ఉన్నట్లుండి నేలపై పడిపోయారు.
మరొక వీడియోలో స్నేహితులతో కలిసి నడుస్తున్న ఓ వ్యక్తి నేలపై కుప్పకూలి మరణించారు. ఈ వీడియోల నడుమ ట్విటర్‌లో #heartattack పేరుతో ఒక హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది.

తాజగా బస్సు నడుపుతున్న డ్రైవర్ కు గుండెపోటు రావడంతో అలాగే కుప్పకూలి చనిపోయాడు. ఈ క్రమంలో ఆ డ్రైవర్ చేతిలో ఉన్న స్టీరింగ్ విడిచిపెట్టాడు. ఈ ఘటనను వెంటనే గమనించిన బస్సు కండక్టర్ అప్రమత్తమై స్టీరింగ్ పట్టుకుని బస్సును పక్కకి తీసుకెళ్లాడు. కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. కండక్టర్ వెంటనే జాగ్రత్త పడకపోతే ఆ బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ ఘటన బెంగళూరులోజరిగింది.

BMTCకి చెందిన బస్సు నేలమంగళ నుంచి దశనపురాకు వెళ్తోంది. మార్గమధ్యంలో డ్రైవర్ కిరణ్ కుమార్ గుండెపోటుతో సీట్లోనే చనిపోయారు. వెంటనే స్పందించిన కండక్టర్ ఓబటేశ్, కిరణ్‌ను పక్కకి లాగి బ్రేక్ తొక్కి బస్సు ఆపేశారు. దీంతో బస్సులోని ప్రయాణికులకు, రోడ్డుపై వెళ్తున్న వారికి ప్రమాదం తప్పింది.

RTC bus going from Nelamangala to Dasanapura in #Bangalore.

Conductor Obalesh jumped onto the driver’s seat after the driver suffered a heart attack and saved everyone’s lives by controlling the bus. pic.twitter.com/mr5NseMk4w— Siddhu Manchikanti Potharaju (@SiDManchikanti) November 6, 2024

Related Posts
హష్ మనీ కేసు..ట్రంప్‌కు భారీ ఊరట
Judge sentences Trump in hush money case but declines to impose any punishment

న్యూయార్క్‌ : అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు సంబంధించిన హష్‌ మనీ కేసులో న్యూయార్క్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ట్రంప్‌ దోషిగా Read more

నేడు హర్యానాలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు
AP CM Chandrababu will visit Haryana today

అమరావతి : : ఏపీ సీఎం చంద్రబాబు హర్యానాలో పర్యటించనున్నారు. నయాబ్ సింగ్ సైనీ హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ Read more

నాలెడ్జ్ హబ్‌గా ఏపీని నిలపడమే లక్ష్యం – సీఎం చంద్రబాబు
The aim is to make AP a kno

విశాఖపట్నం : అత్యాధునిక సాంకేతికత – ఇన్నోవేషన్‌ అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఈ విషయంలో ముందుండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా నిలిపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ముఖ్యమంత్రి Read more

కనుమ.. ప్రత్యేకతలు ఏంటి..? రథం ముగ్గు.. ఎందుకు ?
kanuma ratham muggu

సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమకు ప్రత్యేక స్థానం ఉంది. కనుమను ప్రధానంగా పశువులకు అంకితం చేస్తారు. రైతుల తోడుగా ఉంటూ ఏడాది పొడవునా శ్రమించే పశువులను Read more