world oldest man john alfre

ప్రపంచంలోనే అత్యధిక వయస్కుడు మృతి

ప్రపంచంలో అత్యధిక వయసుగల వ్యక్తిగా పేరొందిన జాన్ టిన్నిస్వుడ్ కన్నుమూశారు. ఆయన వయసు 112 ఏళ్లు. సౌత్ పోర్టులోని కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతూ జాన్ మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటనలో తెలిపారు. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో 1912 ఆగస్టు 26న జన్మించిన టిన్నిస్‌వుడ్.. షెల్, బీపీ కంపెనీల్లో అకౌంటెంట్‌గా పనిచేసి1972లో ఉద్యోగ విరమణ పొందారు.

Advertisements

ఆగస్టు 26న తన 112వ పుట్టినరోజు జరుపుకున్న జాన్‌ ఆల్‌ఫ్రెడ్‌ గిన్నిస్‌ రికార్డుల ప్రకారం దాదాపు తొమ్మిది నెలలపాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి హోదాలో ఉన్నారు. సౌత్‌పోర్టులోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆయనకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ బృందం ఈ ఏడాది ఏప్రిల్​లో సర్టిఫికెట్‌ అందజేసింది. అయితే, సాధారణ జీవన విధానం, అదృష్టమే తన దీర్ఘాయుష్షు రహస్యమని ఆయన అప్పుడు చెప్పడం గమనార్హం. చారిత్రక విషాదమైన టైటానిక్‌ ఓడ మునిగిన 1912లో జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌ జన్మించారు. టైటానిక్‌ నౌక మునిగిన కొన్ని రోజులకే పుట్టిన ఆయన తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ ఆర్మీలో సేవలందించారు. అకౌంటెంట్‌గా పదవీ విరమణ చేసిన ఆయన, ఇంతకాలం పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి సాధారణ జీవన విధానమే కారణమని చెప్పేవారు.

జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌ అలవాట్ల విషయానికి వస్తే..ఎప్పుడూ ధూమపానం చేయలేదు. మద్యం మాత్రం అప్పుడప్పుడు తీసుకునేవారు. ప్రతి శుక్రవారం చేపలు, చిప్స్‌ తీసుకోవడం తప్పితే ప్రత్యేకంగా ఎటువంటి డైట్‌ పాటించలేదు అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు కుమార్తె సుసాన్, నలుగురు మనవళ్లు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. భార్య బ్లాడ్వెన్ 1986లోనే మరణించారు.

Related Posts
మరికాసేపట్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు
CM Chandrababu held meeting with TDP Representatives

ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 1.00 గంటకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అందుకోసం వెలగపూడిలోని సచివాలయం ఎదురుగా ఉన్న హెలి ప్యాడ్ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి Read more

Elon Musk: ‘ఎక్స్’ను అమ్మేసిన‌ ఎలాన్ మ‌స్క్
'ఎక్స్'ను అమ్మేసిన‌ ఎలాన్ మ‌స్క్

టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్ర‌పంచ‌కుబేరుడు ఎలాన్ మ‌స్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)ను విక్రయించినట్టు మస్క్ ప్రకటించారు. అయితే, Read more

టెక్కీల స్థానంలో ఏఐ: టెక్ కంపెనీ సీఈవో..
ai

ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ. చాలా మంది సీఈవోలు, కంపెనీల నాయకులు దీనితో ఉద్యోగులకు ప్రమాదం ఉండదని సర్థిచెప్పే ప్రయత్నాలు Read more

జార్ఖండ్‌లో రెండు కూటముల మధ్య హోరాహోరీ
Clash between two alliances in Jharkhand

రాంచీ: జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య జార్ఖండ్‌లో హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో Read more

×