ys jagan

ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు: జగన్

ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.
చంద్రబాబును విమర్శిస్తూ ఎక్స్ లో జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడుస్తున్నా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పలు హామీలు, వాటిని పెంచి ఇస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్న తీరును టార్గెట్ చేస్తూ ఎక్స్ లో జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు.

తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదని జగన్ ఆక్షేపించారు.

చంద్రబాబు గారూ.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్‌ ఇట్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అంటూ జగన్ ట్వీట్ లో ఏకి పారేశారు. అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారని గుర్తుచేశారు.
తుంగలో తొక్కిన వాగ్దానాలను
వరుసగా కేబినెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి కాని, తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారన్నారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా? అని జగన్ ప్రశ్నించారు.

మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…? అన్నారు. మరోవైపు రైతు భరోసా తీరు కూడా అలానే ఉందని జగన్ ఆరోపించారు.
అలాగే ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే అని జగన్ విమర్శించారు.

Related Posts
ఏపీ బడ్జెట్ పై షర్మిల ఆగ్రహం
బడ్జెట్‌లో సూపర్ సిక్స్ కి అధిక ప్రాధాన్యత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ Read more

ఏపీలో పేపర్ లీక్ కలకలం
paper leaked

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి గణితం ప్రశ్న పత్రం లీక్ కావడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ ప్రశ్న పత్రం యూట్యూబ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో లీక్ Read more

పాతపట్నంలో ఆవుపై దాడి చేసిన పెద్దపులి
tiger attacked a cow

శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్దపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాతపట్నం మండలంలోని తీమర గ్రామ సమీపంలో ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసింది. ఆవును Read more

బొత్స మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది : షర్మిల
YS Sharmila criticism of Botsa Satyanarayana

తనపై బొత్స చేసిన కామెంట్స్‌పై షర్మిల కౌంటర్‌ అమరావతి: వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ Read more