sandhya thater

పుష్ప 2 ప్రీమియర్ షో వద్ద తొక్కిసలాట..బాలుడి పరిస్థితి విషమం

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ మూవీ ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. ప్రీమియర్ షో చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్ల వద్ద చేరుకున్నారు. కాగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడంతో ఓ బాలుడికి ఉపిరిడక స్పృహ తప్పిపడిపోయాడు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు బాలుడ్ని దగ్గరలోని హాస్పటల్ లో జాయిన్ చేసారు. ఈ బాలుడి ఎవరు..? ఎక్కడి నుండి వచ్చాడు..? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.ఈరోజు రాత్రి 9.30 త‌ర్వాత పుష్ప 2 ప్రీమియ‌ర్స్ మొదలయ్యాయి. దాదాపు 3 ఏండ్ల త‌ర్వాత అల్లు అర్జున్ సినిమా థియేట‌ర్లో విడుద‌ల కానుడటంతో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. అయితే న‌టుడు అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్ర‌ముఖులు పలు థియేటర్స్ లలో ప్రీమియర్ షోస్ చూస్తున్నారు.

Advertisements

అల్లు అర్జున్‌తో పాటు అల్లు ఫ్యామిలీకి చెందిన వారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్లో సినిమా చూస్తున్నాడు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నల్లగండ్లలోని అపర్ణలో, ఏషియ‌న్ మ‌హేశ్ బాబు థియేట‌ర్‌లో మైత్రీ మేకర్స్ నిర్మాతలు , దిల్ రాజు, అనిల్ రావిపూడి త‌దిత‌రులు శ్రీరాములు థియేట‌ర్‌లో సినిమా చుస్తున్నట్లు స‌మాచారం. అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్‌తో పాటు అత‌డి సన్నిహితులు అమీర్‌పేటలోని ఏషియ‌న్ అల్లు అర్జున్ సినిమాస్‌లో చూస్తున్నట్లు తెలుస్తుంది.

Related Posts
రాష్ట్ర రైతులకు మార్చి 31లోపు ‘రైతు భరోసా’ – డిప్యూటీ సీఎం భట్టి
bhatti budjet

రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతులకు మార్చి 31లోపు ‘రైతు భరోసా’ పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. వనపర్తిలో Read more

సదరన్ ట్రావెల్స్ “హాలిడే మార్ట్”
Southern Travels "Holiday Mart"

హైదరాబాద్‌: సదరన్ ట్రావెల్స్, 45 లక్షల మందికి పైగా సంతోషకరమైన ప్రయాణీకులకు మరపురాని ప్రయాణ అనుభవాలను అందించడంలో 55 సంవత్సరాల వారసత్వంతో ప్రయాణ మరియు పర్యాటక పరిశ్రమలో Read more

ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్లుగా టీడీపీ అభ్యర్థులు
nelluru eluru

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పాలక మండలుల్లో టీడీపీకి మరిన్ని విజయాలు లభించాయి. నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. ఆమె 41 Read more

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పులు..ఇద్దరు మావోయిస్టుల మృతి
2 Maoists Dead In Chhattisgarh Encounter

కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టు Read more

Advertisements
×