pushpa 2 trailer views

‘పుష్ప-2’ ను ఫ్యామిలీ చూడాలంటే కష్టమే..!!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “పుష్ప-2” చిత్రం మరో నాల్గు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. “పుష్ప” ముందు భాగం బ్లాక్బస్టర్ హిట్ కావడంతో, అభిమానుల్లో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పాత్ర, కథ మరియు మ్యూజిక్ పై అభిమానులలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్‌ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్‌ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్‌ ధరను అదనంగా రూ.800 పెంచింది.

Advertisements

ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్‌, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. ఈ పెంపుతో సింగిల్‌ స్క్రీన్‌లో టికెట్‌ ధర సుమారు రూ.1000 అవుతుండగా, మల్టీప్లెక్స్‌లో రూ.1200లకు పైగా అవుతోంది. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. డిసెంబర్‌ 5 నుంచి 8 వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్‌ 9 నుంచి 16 వరకు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక పెరిగిన రేట్ల‌ను బ‌ట్టి టికెట్ ధ‌ర‌ల‌ను చూసుకుంటే.. ఈ సినిమా విడుదలయిన నాలుగు రోజుల పాటు (డిసెంబ‌ర్ 05 నుంచి 08 వ‌ర‌కు) సింగిల్ స్క్రీన్‌లో రూ.354 గా ఉండ‌బోతుండ‌గా.. మల్టీప్లెక్స్‌లో దీని టికెట్ ధర రూ.531గా నిర్ణ‌యించారు. ఇక నాలుగు రోజుల త‌ర్వాత డిసెంబ‌ర్ 09 నుంచి 16 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.300గా.. మల్టీ ప్లెక్స్‌లో రూ.472 ఉండ‌నుంది. అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.200.. మల్టీఫ్లెక్స్‌లో రూ.354గా నిర్ణ‌యించారు. దీంతో ఈ సినిమా టికెట్ రేట్లు దాదాపు 20 రోజుల‌కి కానీ త‌గ్గేలా లేవు.

అయితే మొద‌టి నాలుగు రోజులు ఒక ఫ్యామిలీ నుంచి న‌లుగురు ఈ సినిమాకి వెళ్లాలి అంటే సింగిల్ స్క్రీన్‌లో రూ.1380 అవ్వ‌నుండగా.. మల్టీప్లెక్స్‌లో రూ.2120లు కానుంది. దీంతో టికెట్ ధ‌ర‌లు మూవీపై ఎఫెక్ట్ ప‌డ‌నున్న‌ట్లు సినీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

Related Posts
Roads : రోడ్లు వేయండి.. నిధుల కోసం వెనకాడొద్దు- సీఎం రేవంత్
cm revanth reddy 1735993001197 1735993006137

తెలంగాణలో రోడ్డు నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. HRDCL (హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) రోడ్డు ప్రాజెక్టులపై సమీక్ష Read more

CM ChandraBabu Naidu: పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ పవన్ కు చంద్రబాబు అభినందనలు
ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం: చంద్రబాబు

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు ఘనంగా జరుగుతున్నాయి. 2014లో పవన్ కళ్యాణ్ స్థాపించిన ఈ పార్టీ ప్రజాసేవ, స్వచ్ఛమైన రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. Read more

venkatapur : భూభారతి చట్టంపై అవగాహన సదస్సు
venkatapur : భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

ములుగు జిల్లా వెంకటాపూర్‌లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో జరిగిన భూభారతి అవగాహన సమావేశం రైతులకు భవిష్యత్తులో భూముల సమస్యల పరిష్కారానికి Read more

Modi : నేడు థాయ్లాండ్ పర్యటనకు ప్రధాని
Narendra Modi :ఈ నెల 6న రామేశ్వరంకు వెళ్లనున్న మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు థాయ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన థాయ్‌లాండ్ ప్రధాని షినవత్రాతో భేటీ కానున్నారు. Read more

×