Narendra Bhondekar

పార్టీ పదవికి శివసేన ఎమ్మెల్యే రాజీనామా

మహరాష్ట్రలో బీజేపీ కూటమి గెలుపు పొందినప్పటినుంచి సీఎం, మంత్రి పదవుల పై కసరత్తులు జరుగుతున్నా, ఇంకా అక్కడ దీనిపై స్పష్టత రావడం లేదు. తాజాగా మంత్రి పదవిని ఆశించి భంగపడిన శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) ఎమ్మెల్యే నరేంద్ర భోండేకర్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ డిప్యూటీ నేతగా, విదర్భ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. భండారా-పావని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన పార్టీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు మంత్రి పదవిని ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అయితే, నిన్న జరిగిన కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఏక్‌నాథ్ షిండే, ఉదయ్ సామంత్, ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు మెసేజ్ పంపారు.
దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉదయ్ సామంత్‌కు మంత్రి పదవి దక్కింది. మొత్తం 39 మంది నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 19 మంది బీజేపీ నేతలు కాగా, 11 మంది శివసేన, 9 మంది ఎన్సీపీ నేతలు ఉన్నారు. ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలతో కలుపుకొంటే కేబినెట్ బెర్త్‌ల సంఖ్య 42కు చేరింది.  

Advertisements
Related Posts
Rahul Gandhi : బీసీ బిల్లును పంపించారన్న రాహుల్ గాంధీ
Rahul Gandhi బీసీ బిల్లును పంపించారన్న రాహుల్ గాంధీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన కీలక ప్రక్రియపై కేంద్రం స్పందించకపోవడంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీసీల రిజర్వేషన్లు పెంచుతూ పంపిన Read more

మహా కుంభమేళ నీటి విక్రయం -భారీగా లాభాలు
మహా కుంభమేళ నీటి విక్రయం -భారీగా లాభాలు

బ్లింకిట్, బిగ్‌బాస్కెట్, అమెజాన్ వంటి చాల ఈ-కామర్స్ కంపెనీలు మహా కుంభ జలాలను(water) ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. దీనిపై భారీ లాభాలు కూడా ఆర్జిస్తున్నాయి. ఈ మహా కుంభమేళా Read more

ఢిల్లీ భూకంపం పై మోదీ హెచ్చరిక
ఢిల్లీ భూకంపం పై మోదీ హెచ్చరిక

ఫిబ్రవరి 16, 2025 దేశ రాజ‌ధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో సోమవారం తెల్లవారుజామున 5:36 గంటలకు ఢిల్లీతో పాటు నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో Read more

VijaySaiReddy:పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుదలపై స్పందించిన విజయసాయిరెడ్డి
VijaySaiReddy:పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుదలపై స్పందించిన విజయసాయిరెడ్డి

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వంటగ్యాస్ వినియోగదారులకు మరోసారి భారీగా ఆర్ధిక భారం మోపింది.గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరను ఒక్కసారిగా రూ.50 పెంచింది. Read more

Advertisements
×