Hydra team going to Bangalore today

నేడు బెంగళూరుకు వెళ్లనున్న హైడ్రా బృందం

హైదరాబాద్‌: హైడ్రా బృందం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది. ఈ మేరకు రెండు రోజుల పాటు హైడ్రా బెంగళూరులో పర్యటించనుంది. బెంగళూరులో చెరువుల పరిరక్షణ ఎలా ఉంది..అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. అనే దానిపై అన్వేషణ హైడ్రా చేయనుంది. ఈ నేపథ్యంలోనే నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది.

Advertisements

చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయిలో హైడ్రా బృందం పరిశీలించనుంది. ఈ మేరకు బెంగళూరుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు..బయల్దేరనున్నారు. కాగా, హైడ్రా మళ్లీ రంగంలోకి దిగుతోంది. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు జారీ హైడ్రా చేస్తోంది. కబ్జాను బట్టి వారం నుంచి 15 రోజుల టైం ఇస్తామంటున్నది. ఇప్పటికే సుమారు 60 నోటీసులు జారీ చేసింది హైడ్రా. ఈ నెలాఖరికి కొన్ని అక్రమ నిర్మాణాలను హైడ్రా డిమాలిష్ చేయనుంది. పూర్తిగా కబ్జా అయిన కొన్ని చెరువులకు తిరిగి పునరుజ్జీవనం కల్పిస్తామంటున్న హైడ్రా…. చెరువుల్లోకి వచ్చే వ్యర్ధాలను ఆపడానికి పిసిబి తో కలిసి పని చేయనుంది. చెరువుల స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చే వారం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తో MOU చేసుకోనుంది హైడ్రా.

Related Posts
CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు
CBI searches former CM Bhupesh Baghel house

CBI Raids: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు Read more

CBN చేతకాని పాలనకు యువతి బలి: YCP
వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం

AP: ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో యువతి (17) మృతి చెందడంపై YCP మండిపడింది. 'చంద్రబాబు చేతకాని పాలనకి మరో యువతి బలైపోయింది. బద్వేలులో ఇంటర్ Read more

Narendra Modi: పవన్‌ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని మోదీ
Narendra Modi: పవన్‌ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని మోదీ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్‌ స్కూల్‌లో చదువుకుంటున్న పవన్‌ కల్యాన్‌ Read more

Pawan Kalyan: మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్‌కి వచ్చిన పవన్ కల్యాణ్
Pawan Kalyan: మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్‌కి వచ్చిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో Read more

Advertisements
×