pawan kalyan to participate in palle panduga in kankipadu

నేడు పిఠాపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

అమరావతి: నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గాలలో కూడా డిప్యూటీ సీఎం పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలోనే రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రారంభించనున్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి స్థానిక అధికారులతో సమీక్ష కూడా నిర్వహించనున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు కూడా విడుల చేయనున్నారు.

కాగా, సోమవారం (నవంబర్ 4) ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గంలో 11.30 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ కు పవన్ కళ్యాణ్‌ చేరుకుంటారు. అక్కడ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభిస్తారు. అనంతరం గొల్లప్రోలు హౌసింగ్ కాలనీకి, సూరంపేట హ్యాబిటేషన్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ ను ప్రారంభించి.. తహశీల్దార్ కార్యాలయంలో పనులకు శ్రీకారం చుడతారు.

ఇకపోతే..మధ్యాహ్నం 1 గంటకు చేబ్రోలులో తన నివాసానికి చేరుకుని పవన్‌ కళ్యాణ్‌ విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు చేబ్రోలు నుంచి బయల్దేరి పిఠాపురంలోని టీటీడీ కల్యాణమండపానికి చేరుకుని ఆర్ఆర్ బీహెచ్ఆర్ డిగ్రీ కాలేజీని ప్రారంభిస్తారు, అలాగే కల్యాణమండపం మరమ్మతు పనులు, ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరమ్మతు పనుల్ని ప్రారంభిస్తారు. పిఠాపురంలోని బాదం మాధవ జిల్లా పరిషత్ హైస్కూల్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కాకినాడ రూరల్ లోని పీ.వెంకటాపురం గెస్ట్ హౌస్ కు చేరుకుని, చేబ్రోలులోని తన నివాసానికి వెళ్తారు. రాత్రికి అక్కడే బసచేస్తారు.

ఇంక మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం తన నివాసం నుంచి కొత్తపల్లి పీహెచ్ సీకి చేరుకుని.. పీహెచ్ఎస్ ఔట్ పేషెంట్ విభాగానికి, యు.కొత్తపల్లి మండలంలోని పలు స్కూళ్లకు శంకుస్థాపనలు చేస్తారు. 1 గంటకు చేబ్రోలు నివాసానికి చేరుకుని, 3 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి విజయవాడకు వెళ్తారు.

Related Posts
ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
social media

ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఉపయోగించడానికి త్వరలో నిషేధం ఉండనుంది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటనీ ఆల్బానీజ్ గురువారం తన ప్రభుత్వం పిల్లల్లో సోషియల్ Read more

అంబటి వ్యాఖ్యలకు పెమ్మసాని కౌంటర్
pemmasani chandrasekhar amb

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మాటల యుద్ధం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. Read more

ఇండియాకు ట్రంప్‌ వార్నింగ్
5d039be7 9854 45f0 9161 681422016864

జనవరిలో ప్రమాణస్వీకారం చేయనున్న అమెరికా కాబోయి అధ్యక్షుడు ట్రంప్ ఇండియాను హెచ్చరించారు. ఎన్నికలో గెలిచిన ట్రంప్‌.. ప‌న్నుల అంశంలో భార‌త విధానాన్ని త‌ప్పుప‌ట్టారు. అమెరికా ఉత్ప‌త్తులపై భారీగా Read more

బీరుప్రియులకు రేవంత్ సర్కార్ షాక్
beer price hike

తెలంగాణలో బీరుప్రియులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తాజా నిర్ణయంతో బీర్ల ధరలు 15 శాతం మేర పెరగనున్నాయి. ఈ పెరిగిన ధరలు Read more