Distribution of pensions in

నేడు ఏపీలో పింఛన్ల పంపిణీ

రేపు (ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ సెలవు దినం అయితే ముందు రోజు ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తోంది. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా పథకం పేరిట రూ.4 వేల ఫించన్‌ సక్రమంగా పంపిణీ చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈసారి అనంతపురం జిల్లాలో పర్యటించి సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లాలో భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు అనంతపురంలోని నేమకల్లులో లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు ఉ.11.40 గంటలకు గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయం బయల్దేరుతారు. 12.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు నుంచి నేమకల్లుకు వెళ్తారు.

గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తారు. హంగు ఆర్భాటాలకు దూరంగా.. సామాన్య ప్రజానీకానికి అతి దగ్గరగా సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. రాయదుర్గం నియోజవర్గం బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామానికి శనివారం చంద్రబాబు చేరుకుంటారని వెల్లడించారు. సీఎం పర్యటన నేపథ్యంలో గ్రామంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులతో కలిసి హెలిప్యాడ్‌ స్థలాన్ని, ఆంజనేయస్వామి దేవాలయాన్ని, గ్రామసభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

Related Posts
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి.. నిబంధనలు ఇవే..!!
Indiramma houses

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిబంధనలను విడుదల చేసింది. పేదలకు అందుబాటు ధరలో గృహనిర్మాణ అవకాశాన్ని కల్పించడానికి ఈ పథకం ప్రత్యేకంగా Read more

ప్రధాన నేతలు జీ20 గ్రూప్ ఫోటోకు దూరంగా :బైడెన్, ట్రుడో, మెలోని గురించి చర్చలు
g20 group photo

బ్రెజిల్‌లో జరిగిన జీ20 సదస్సులో, ప్రపంచ నాయకులు ఒక సంప్రదాయ ఫోటో కోసం నిలబడ్డారు. కానీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో Read more

సునీతా విలియమ్స్‌ 6.5 గంటల అంతరిక్ష నడక
సునీతా విలియమ్స్‌ 6.5 గంటల అంతరిక్ష నడక

నాసా వ్యోమగాములు నిక్ హేగ్ మరియు సునీతా విలియమ్స్ 2025లో తమ తొలి అంతరిక్ష నడకను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నడక జనవరి 16న గురువారం, ఉదయం Read more

సీఎం విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు
Salary of Rs 2 lakh per month for cabinet rank holders - AP Govt

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబరు 2న విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, ఆయన కొత్తవలస మండలంలోని దెందేరు Read more