Rahul Gandhi should come only to apologize to the people of Telangana

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్ గాంధీ రావాలి : కేటీఆర్

హైదరాబాద్‌ : నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బహిరంగ లేఖ విడుదల చేశారు. అధికారం కోసం అడ్డగోలు హమీలిచ్చి, సబ్బండ వర్గాలకు చేసిన మోసానికి, అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాష్ట్రంలో అడుగు పెట్టాలని రాహుల్‌ గాంధీని కేటీఆర్ డిమాండ్‌ చేశారు. పదేళ్లలో ఘనంగా అభివృద్ధి చెందిన తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీకి.. పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా బహిరంగ లేఖతో ఒక్కసారి మీకు గుర్తు చేయదలచుకున్నానన్నారు.ఆరు గ్యారెంటీలని ప్రజల గొంతుకోశారని, పిలిస్తే పలుకుతానని పారిపోయిందెవరని, ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారంటూ రాహుల్ గాంధీని ప్రశ్ని్ంచారు.

Advertisements

రైతులు, నిరుద్యోగులు, పోలీసులు, చేనేత కార్మికులు, ఆటోడ్రైవర్లు అందరూ బాధితులేనని, మూసీ, హైడ్రా పేరిట ప్రజలను వంచించారని, దమ్ముంటే వచ్చి ఆ బాధితులను కలవండని, అశోక్ నగర్ నిరుద్యోగులను పలకరించండని సవాల్ చేశారు. ఇచ్చిన ఒక్క హామీని సైతం నిలబెట్టకోకుండా ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని హింసించే పులకేశిగా మారాడని, ఆయన వసూళ్లు తెలిసినా ఢిల్లీ నేతలు ఏం తెలియనట్లుగా నటిస్తూ ఢిల్లీలో గప్‌చుప్‌ అయిపోయారని విమర్శించారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కూడా కష్టమొచ్చిన సరే ఇలా పిలుస్తే అలా వస్తానని చెప్పి.. తీరా గద్దెనెక్కిన తర్వాత మా ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారని ధ్వజమెత్తారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ, హైడ్రా బాధితులు ఇలా ఒక్కరే కాదు.. సమాజంలో అన్ని వర్గాలను నయనంచనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts
SLBC టన్నెల్ వద్ద ముమ్మరంగా సహాయ చర్యలు
SLBC టన్నెల్ వద్ద ముమ్మరంగా సహాయ చర్యలు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు 14వ రోజుకి చేరుకున్నాయి. రెస్క్యూ బృందాలు 'ఆపరేషన్ డి'ని అమలు చేస్తూ మరింత వేగంగా Read more

రేపటి నుండి సమగ్ర కుటుంబ సర్వే..10 ప్రధాన అంశాలు
Comprehensive family survey from tomorrow.10 main points

హైదరాబాద్‌: రేపటి నుండి తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ Read more

తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలి : భూమన
Chandrababu should be responsible for the stampede.. Bhumana Karunakar Reddy

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు. పశువుల మంద Read more

Suicide: తమ్ముడి తప్పుతో..వేదనతో అక్క ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య
Suicide: తమ్ముడి తప్పుతో..వేదనతో అక్క ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య

కుటుంబ విభేదాలతో ముగిసిన మానవ విలయం కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని కాడుగోళ గ్రామంలో జరిగిన ఘోర ఘటన స్థానికులను శోకసంద్రంలో ముంచింది. కుటుంబానికి Read more

×