ts group2

తెలంగాణ గ్రూప్-2 ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థుల పరీక్ష షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 2024, డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. హాల్ టికెట్లను డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతామని.. టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది.

డిసెంబ‌ర్ 15న ఉద‌యం 10 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్ -1 ప‌రీక్ష నిర్వహిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుండి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్-2 ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. అదేవిధంగా డిసెంబ‌ర్ 16వ తేదీన ఉద‌యం 10 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్-3 నిర్వ‌హించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్- 4 ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

ప్ర‌తి పేప‌ర్ లో 150 ప్ర‌శ్న‌లు ఉండగా 150 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. అంతే మొత్తం నాలుగు పేప‌ర్ల‌కు క‌లిపి 600 మార్కులు ఉండ‌నున్నాయి. ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు అర‌గంట ముందే 9.30 నిమిషాల‌కు ప‌రీక్ష కేంద్రంలో ఉండాలి. ఆ త‌ర‌వాత నిమిషం ఆల‌స్యం అయినా ప‌రీక్ష కేంద్రంలోనికి అనుమ‌తించరు.

గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదలయ్యే సమయంలో సమస్యలు ఏవైనా తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. మొత్తం మొత్తం 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు ఈ గ్రూప్-2 పరీక్షకు అప్లై చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ నెలలోనే గ్రూప్-2 పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ అదే సమయంలో డీఎస్సీ ఎగ్జామ్స్ ఉండటంతో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థుల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసింది. డీఎస్సీ పరీక్షలను చెప్పిన డేట్‌కే నిర్వహించి గ్రూప్-2 పరీక్షలను పోస్ట్‎పోన్ చేసింది.

Related Posts
స్టాలిన్‌ పై త‌మిళ‌సై మండిపాటు
స్టాలిన్‌ పై త‌మిళ‌సై మండిపాటు

తమిళనాడులో భాషా వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. హిందీ భాషా వ్యతిరేకత, భాషా విధానాలు, విద్యా వ్యవస్థపై నియంత్రణ తదితర అంశాలపై డీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. Read more

ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టాలి: మహేష్ కుమార్ గౌడ్
mahesh kumar

ప్రతిపక్ష నేతలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని Read more

సిరియాలో టర్కీ దాడులు: ప్రజలపై తీవ్ర ప్రభావం…
siria

టర్కీ గగనతల దాడులు, సిరియాలోని కుర్దిష్ ప్రాంతంలో మానవీయ సంక్షోభాన్ని మరింత తీవ్రమైనవి చేసాయి. 2019 అక్టోబర్ నుంచి 2024 జనవరి మధ్య, టర్కీ 100కి పైగా Read more

సీఎంని కలిసిన తర్వాత దిల్ రాజు వ్యాఖ్యలు
సీఎంని కలిసిన తర్వాత దిల్ రాజు వ్యాఖ్యలు

‘సంక్రాంతి సినిమాలు, టిక్కెట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇప్పుడు ముఖ్యం కాదు’: దిల్ రాజు తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని Read more