tirumala hundi

తిరుమల ఆలయ హుండీలో చోరీ

తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీ నుంచి ఓ భక్తుడు నగదు చోరీ చేశాడు. తమిళనాడుకు చెందిన వేణులింగం రూ.15వేలు తీసినట్లు అధికారులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఆలయంలోని స్టీల్‌ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ చేసి పరారయ్యాడు. సీసీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా చోరీ జరిగినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. దొంగిలించిన రూ.15వేల నగదును అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుమల తిరుపతి (టీటీడీ) విజిలెన్స్‌ అధికారులు పోలీసులకు అప్పగించారు. మూడు రోజుల క్రితం ఘటన జరగ్గా.. తాజాగా బయటపడింది. ఆ యువకుడ్ని అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. ఆ యువకుడు చేసిన నేరాన్ని ఒప్పుకోగా.. అతడి దగ్గర నుంచి రూ. 13,870 డబ్బుల్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Advertisements

ఇక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీ భక్తులందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. దైవ నిధుల ప్రాముఖ్యమైన కేంద్రం. ఇది ప్రపంచంలో అత్యధిక విరాళాలు అందే ఆలయాలలో ఒకటి. భక్తులు తమ శక్తి కొలదీ తిరుమల హుండీలో నగదు, బంగారం, వెండి, ఆభరణాలు, విదేశీ కరెన్సీ వంటి విరాళాలను సమర్పిస్తారు. ఇది స్వామి పట్ల వారి భక్తిని వ్యక్తపరుస్తుంది. తిరుమల హుండీ ద్వారా రోజుకు సగటున రూ. 3-రూ.4 కోట్లు వరకు విరాళాలు సమకూరతాయి. ముఖ్య పండుగల సమయంలో ఇది మరింత పెరుగుతుంది. హుండీ విరాళాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తుంది. హుండీ ఆదాయాన్ని ఆలయ నిర్వహణ, ఆర్జిత సేవలు, విద్యా, వైద్య సేవల కోసం ఉపయోగిస్తారు. ఆలయ అవసరాలు, దాతృత్వ కార్యక్రమాలు, మరియు ధార్మిక విధానాల నిర్వహణకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇది తిరుమల శ్రీవారి ఆలయాన్ని ప్రపంచంలోని ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Related Posts
Internet: 6 నెలల్లో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ సేవలు
Internet: 6 నెలల్లో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ సేవలు

ఇంటింటికీ ఇంటర్నెట్ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నెట్ ఆధునిక యుగంలో మన జీవనశైలిలో కీలక భాగమైంది. ప్రతి పని డిజిటలైజేషన్ వైపు పయనిస్తున్న ఈ సమయంలో, ఇంటర్నెట్ Read more

Pope: పోప్ రేసులో వున్నవారు ఎవరు..ఇందుకు కావాల్సిన అర్హతలు ఏమిటి?
పోప్ రేసులో వున్నవారు ఎవరు..ఇందుకు కావాల్సిన అర్హతలు ఏమిటి?

కాబోయే పోప్ ఎవరు? ఈ నిర్ణయం కాథలిక్ చర్చ్ మీద, ప్రపంచంలోని 140 కోట్ల రోమన్ క్యాథలిక్కుల మీద ప్రభావం చూపుతుంది. పోప్ ఫ్రాన్సిస్ వారసుడు ఎవరనేది Read more

‘గేమ్‌ ఛేంజర్‌’ లీక్‌పై నిర్మాత ఆవేదన
'Game changer' police instr

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మించిన భారీ బడ్జెట్‌ పొలిటికల్‌ డ్రామా 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer Read more

సంక్రాంతి నుంచి తెలంగాణ రైతుభరోసా పథకం..?
rythu bharosa

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ పథకం కేవలం సాగు చేసే భూమికి మాత్రమే పెట్టుబడి Read more

Advertisements
×