bujjithalli song

‘తండేల్’ నుండి లవ్ సాంగ్ విడుదల

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న ‘తండేల్’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సాంగ్ ను ఈనెల 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వాలెంటైన్ వీక్ సందర్భంగా 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల వెల్లడించింది. దీంతో మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను గురువారం విడుదల చేసారు. బుజ్జి తల్లి అంటూ సాగే ఈ పాట.. తమ లవర్స్‌ను బుజ్జిగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ లవ్ సాంగ్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయిపోతుండగా.. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీనే హైలెట్‌గా నిలిచింది. దీంతో ‘తండేల్’పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుంది. ఈ క్రమంలో కొందరు మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్టు గార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాల గురించి ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో నాగ చైతన్య రగ్గ్‌డ్ లుక్​లో కనిపించగా, సాయి పల్లవి తన క్యూట్ లుక్స్​తో ఆకట్టుకున్నారు. బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతూ ‘దద్దా గుర్తెట్టుకో ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్ ఇక రాజులమ్మ జాతరే’ అంటూ చెప్పే డైలాగ్‌ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సినిమాకు రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్​పై అల్లు అరవింద్, బన్నీ వాస్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related Posts
గేమ్ ఛేంజర్ పై నకిలీ బాక్సాఫీస్ కలెక్షన్ల విమర్శలు
గేమ్ ఛేంజర్ పై నకిలీ బాక్సాఫీస్ కలెక్షన్ల విమర్శలు

రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్ "చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను చేసినట్టుగా ప్రకటించి విమర్శల పాలవుతోంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార పోస్టర్లు సినిమా Read more

పార్లమెంట్‌లో విపక్షాల నిరసన..స్పీకర్‌ ఆగ్రహం
Opposition protest in Parliament angered Speaker

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశాల్లో భాగంగా శనివారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. Read more

వైసీపీకి అయోధ్య రామిరెడ్డి గుడ్ బై..!
Goodbye to YCP Ayodhya Rami Reddy.

అమరావతి: విజయసాయిరెడ్డితో వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. వైసీపీ తెర వెనుక రాజకీయాల్లో కీలకంగా ఉండే మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా Read more

వ్యవసాయ బడ్జెట్ లో మళ్ళీ సూక్ష్మపోషకాల పంపిణీ
వ్యవసాయ బడ్జెట్ లో మళ్ళీ సూక్ష్మపోషకాల పంపిణీ

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 28) ప్రవేశపెట్టింది. రూ.3.22 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. Read more