టీమ్‌ ఇండియాకు అసలేమైంది?

టీమ్‌ ఇండియాకు అసలేమైంది?

టీం ఇండియాలో ఏదో సమస్య జరుగుతోందనే స్పష్టంగా కనిపిస్తోంది.ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత ఇది మరింత స్పష్టమైంది. జట్టులో ఆటతీరు తగ్గిందా?లేక జట్టులో అంతర్గత గొడవలే కారణమా? బీసీసీఐ ఇప్పటికే ఈ విషయంపై రివ్యూ చేపట్టింది. మార్పులు అవసరమని,అవసరమైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరికలు వెలువడుతున్నాయి.ఆసీస్‌ టూర్‌లో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీం ఇండియా,గతంలో కివిస్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఇదే దుస్థితి ఎదుర్కొంది.

Advertisements

రికార్డుల పరంగా బలమైన జట్టుకి ఇలాంటి తక్కువ ప్రదర్శన ఎందుకు?కోచ్‌ మరియు ఆటగాళ్ల మధ్య సంబంధాలు బాగోలేవా?రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ల వైఖరేనా? గంభీర్ ఆధ్వర్యంలో టీమ్ స్పిరిట్ తగ్గిందా? ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో కుటుంబ సభ్యులను అనుమతించకపోవడాన్ని అంగీకరించరా?సీనియర్ ఆటగాళ్లు కొత్త ఆటగాళ్లతో కలిసి కలిసిపోవడం లేదన్న వాదనలు ఉన్నాయ. సెలక్టర్లతో గొడవలు,గంభీర్ విధానం వల్ల ఏర్పడిన మనస్పర్ధలు టీమ్‌లో బలహీనతకు దారితీశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితులపై బీసీసీఐ సీరియస్ అయింది.ఆటతీరు మెరుగుపరచకపోతే, టీమ్‌లో మార్పులు తప్పవన్న సంకేతాలు ఇస్తోంది.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు గంభీర్‌కు వ్యతిరేకంగా ఉన్నారా?గంభీర్ ఆశించిన విధంగా జట్టును ముందుకు నడిపించలేకపోయాడా?బీసీసీఐ ఇప్పటికే మార్పులకు సిద్ధమవుతోందని ప్రచారం సాగుతోంది.ఛాంపియన్స్ ట్రోఫీ వరకు సమయం ఇస్తారా? లేక తక్షణమే మార్పులు చేస్తారా? ప్రస్తుతం ఇదే చర్చకు కేంద్ర బిందువైంది.ఈ పరిస్థితిలో టీం ఇండియా ఏ మార్గం ఎంచుకుంటుందో వేచి చూడాలి.

Related Posts
IPL 2025: ఐపీఎల్ కామెంటేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన శార్దూల్ ఠాకూర్
IPL 2025: ఐపీఎల్ కామెంటేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన శార్దూల్ ఠాకూర్

ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఇటీవల తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. విమర్శలు చేసేవాళ్లు ముందుగా తమ Read more

న్యూజిలాండ్ పై రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూజిలాండ్ పై రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠ భరితమైన పోరు జరగనుంది. ఈ హై-వోల్టేజ్ Read more

మరో రికార్డును లిఖించిన స్టైలిస్ ప్లేయర్!
Smriti Mandhana

స్మృతి మంధాన 2024లో 1602 పరుగులతో క్రికెట్ ప్రపంచంలో రికార్డు సృష్టించింది.వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 91 పరుగులు చేసి, భారత జట్టును భారీ స్కోరుకు నడిపించింది.ఆమె Read more

PSL 2025: రెండో ఓటమిపై స్పందించిన రిజ్వాన్
PSL 2025: రెండో ఓటమిపై స్పందించిన రిజ్వాన్

పీఎస్‌ఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 సీజన్ లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు అనూహ్యంగా వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే గత మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కొన్న Read more

×