ttd

టీటీడీలో కొనసాగుతున్న అంతర్గత గొడవలు

ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై అంతర్గత గొడవలు కొనసాగుతూనే వున్నాయి. నిన్న వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశం కూడా రచ్చ రచ్చగా మారింది. తిరుమల ఆలయ పాలనా వ్యవహారాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పాలక మండలి సభ్యులు నిప్పులు చెరిగారు. అధికారుల ఏకపక్ష తీరు వల్లే టీటీడీ చరిత్రలోనే మొదటిసారిగా సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిందని విమర్శించారు.

ప్రధానంగా ఈవో శ్యామలరావు వ్యవహార శైలిని పాలక మండలి సభ్యులు తప్పుబట్టినట్లు సమాచారం! తొక్కిసలాట బాధిత కుటుంబాలకు చేయాల్సిన సహాయంపై తీర్మానాలు చేసేందుకు వీలుగా తక్షణం బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో… శుక్రవారం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన శుక్రవారం తిరుమలలో పాలక మండలి భేటీ అయ్యింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముగ్గురు సభ్యులు మినహా మిగిలిన సభ్యులు… ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ భేటీ కూడా ‘అధికారులు వర్సెస్‌ పాలకమండలి’గా మారింది. సమావేశ ప్రారంభంలోనే చైౖర్మన్‌ నాయుడు టీటీడీ అధికారుల తీరుపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అధికారులు తీసుకునే తప్పుడు నిర్ణయాలకు తాము రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. అధికారులు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటారని… ప్రజా క్షేత్రంలో తాము సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలని సూచించారు. ‘‘పాలక మండలి సభ్యులకు అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదు. వైకుంఠ ఏకాదశికి భక్తులు భారీగా వస్తారని అందరికీ తెలిసిందేనని… ఈ విషయంలో అధికారుల ప్రణాళిక ఏమిటో, దీనిని ఏ రకంగా నిర్వహించదల్చుకున్నారో తమకు సమాచారం లేదని ఒక సభ్యుడు చెప్పారు.

Related Posts
ఇన్ని దేశాల్లో తెలుగు వారు ఉన్నారా..?: చంద్రబాబు
Are there Telugu people in all these countries?: Chandrababu

జ్యూరిచ్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్‌ చేరుకున్నారు. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామిక Read more

తిరుమలలో విషాదం.. మూడేళ్ల బాలుడి మృతి
tirumala vishadam

తిరుమలలో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. తిరుమల బస్టాండ్ సమీపంలోని పద్మనాభ నిలయం భవనం రెండో అంతస్తుపై నుంచి పడి మూడేళ్ల బాలుడు సాత్విక్ మృతి చెందాడు. Read more

వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు
ఎమ్మెల్సీ టికెట్ పై సంచలన చర్చ వర్మకు గౌరవం దక్కాలనే మనోహర్ అభిప్రాయం

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు Read more

ఇకపై ఆన్లైన్లో టెన్త్ సర్టిఫికెట్లు
online certificate

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి సర్టిఫికెట్లు ఇక నుంచి ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇది విద్యార్థులు, వారి Read more