Election

జమిలి బిల్లుపై జేపీసీ బాధ్యతలు ఏమిటి?

దేశ వ్యాపితంగా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన జమిలి బిల్ ను జేపీసీకి పంపిన విషయం తెలిసేందే. నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్ ఎన్నికల నిర్వహణ బిల్లుల విస్తృత పరిశీలన కోసం ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’కి (జేపీసీ) పంపుతూ లోక్‌సభ నిర్ణయించింది. పార్లమెంట్, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

Advertisements

విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన ఈ ప్రతిపాదిత ‘129 సవరణ చట్టం-బిల్లు’, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ బిల్లుల విస్తృత పరిశీలన కోసం ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’కి (జేపీసీ) పంపుతూ లోక్‌సభ నిర్ణయించింది. అయితే, జేపీసీని ఎలా ఏర్పాటు చేస్తారు? ఈ కమిటీ ఏం చేస్తుంది? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
ఎంపీల సంఖ్య ఆధారంగా..
పార్లమెంట్‌లో ఉన్న ఎంపీల సంఖ్య ఆధారంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన చట్టసభ్యులను కమిటీలోకి తీసుకుంటారు. రాజ్యసభ సభ్యులు కూడా కమిటీలో ఉంటారు. అత్యధిక సంఖ్యలో ఎంపీలను కలిగివున్న పార్టీకి కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రస్తుతం ఆ అవకాశం బీజేపీకి దక్కనుంది.
కమిటీ కాల వ్యవధి 90 రోజులు
జేపీసీలో గరిష్ఠంగా 31 మంది సభ్యులు ఉండవచ్చు. ఈ కమిటీ కాల వ్యవధి 90 రోజులుగా ఉంటుంది. అవసరమైతే ఆ తర్వాత గడువును పొడిగించేందుకు అవకాశం ఉంటుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మరో 48 గంటల్లోనే జేపీసీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శుక్రవారంతో (డిసెంబర్ 20) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిపోనున్నాయి.
జేపీసీ బాధ్యతలు
కమిటీలో భాగంగా లేని ఎంపీలు, మాజీ జడ్జిలు, లాయర్లు వంటి ఇతర న్యాయ, రాజ్యాంగ నిపుణులతో పాటు సంబంధిత భాగస్వాములతో జేపీసీ సభ్యులు ‘విస్తృత సంప్రదింపులు’ జరుపుతారు. ఈ సమాచారాన్ని సేకరించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలన చేసి క్లాజులవారీగా లోక్‌సభకు నివేదికను సమర్పించనుంది. మూడవసారి బీజేపీ గెలవడంతో జమిలిపై పట్టుదలతో వుంది.

Related Posts
ఆప్ ఓటమి పై స్వాతి మాలీవాల్ ట్వీట్
Swati Maliwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా కేవలం 'ద్రౌపది Read more

ఢిల్లీ ప్రచారంలో యోగీ ఎంట్రీతో కీలక మలుపు
yogi adityanath

ఢిల్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ముందుగానే ఎన్నికల బరిలో దిగిన కేజ్రీవాల్ విజయం తమ Read more

కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌ని ఉపయోగించిన నర్సు
కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌ని ఉపయోగించిన నర్సు

కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లా హనగల్ తాలూకాలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న నర్సు, గాయానికి కుట్లు వేయాల్సిన Read more

RBI Interest Rates : మరోసారి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌..కీలక వడ్డీరేట్లు తగ్గింపు
Once again, RBI good news... key interest rates cut

RBI Interest Rates : భారతీయ రిజర్వ్ బ్యాంక్ ‍‌(ఆర్‌బీఐ), దేశంలోని రుణగ్రహీతలకు 'రెండోసారి' ఊరట కల్పించింది. బ్యాంక్‌ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే రెపో రేటును Read more

×