చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ

చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ

అమరావతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఎన్డీఏ నేతల సమావేశం కీలకంగా మారింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ గంటన్నర పాటు సాగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి, ఇతర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై అమిత్ షాతో సుదీర్ఘ చర్చ జరిగింది.విజయవాడలో జరిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షాకు, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు లోకేశ్, అనిత, పురంధేశ్వరి ఘన స్వాగతం పలికారు.

Advertisements
చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ
చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ

అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన అమిత్ షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్మానం చేశారు.చంద్రబాబు నివాసంలో అమిత్ షాతో జరిగిన డిన్నర్ మీటింగ్ ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రం సాయం, విభజన హామీల అమలు, అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి పెట్టింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కేంద్రంపై కృతజ్ఞతలు తెలుపుతూ, పెండింగ్ ప్రాజెక్టులపై అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.సమావేశంలో ఎన్డీఏ నేతల మధ్య రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయి.

బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఎన్టీఆర్‌కు భారతరత్నను ప్రస్తావించగా, చంద్రబాబు కూడా అమిత్ షాతో ఈ అంశాన్ని ముందుకు తెచ్చారు.విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం 11,140 కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించిన విషయం ప్రత్యేక చర్చకు కారణమైంది. ఈ నిర్ణయంతో తెలుగు ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించామని అమిత్ షా వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా ఆర్థిక ప్యాకేజ్‌పై ట్వీట్ చేస్తూ ఏపీ అభివృద్ధిపై కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు ఈరోజు గన్నవరంలో జరిగే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ క్యాంప్ ప్రారంభ వేడుకల్లో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం జరగనుంది.

Related Posts
Andhra Pradesh: 3 రోజుల పాటు పాపికొండలు యాత్ర రద్దు ఎందుకంటే?
Andhra Pradesh: 3 రోజుల పాటు పాపికొండలు యాత్ర రద్దు ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ లోని పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. ఒకటి, రెండు రోజులుగా అకాల వర్షాలతో పాటుగా ఈదురుగాలులు(Stormy winds) వీస్తుండటంతో పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు.ఈరోజు నుంచి మూడు రోజులపాటు Read more

NITI Aayog Meeting : ఈ నెల 24న నీతి ఆయోగ్ సమావేశం
NITI Aayog meeting

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 24న నీతి ఆయోగ్ యొక్క వార్షిక సమావేశం జరగనుంది. ఈ పూర్తి స్థాయి సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల Read more

తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టులో విచారణ.. ధర్మాసనం కీలక తీర్పు
supreme court appoints special sit for tirumala laddu probe

supreme-court-appoints-special-sit-for-tirumala-laddu-probe న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో Read more

Internet: 6 నెలల్లో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ సేవలు
Internet: 6 నెలల్లో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ సేవలు

ఇంటింటికీ ఇంటర్నెట్ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నెట్ ఆధునిక యుగంలో మన జీవనశైలిలో కీలక భాగమైంది. ప్రతి పని డిజిటలైజేషన్ వైపు పయనిస్తున్న ఈ సమయంలో, ఇంటర్నెట్ Read more

Advertisements
×