rahul cbn

చంద్రబాబు కు రాహుల్ గాంధీ ఫోన్..

ఏపీ సీఎం చంద్రబాబు కు కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫోన్ చేసారు. చంద్రబాబు తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి మృతితో తీవ్ర విషాదంలో మునిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ..బాబు కు ఫోన్ చేసి పరామర్శించారు. విషాదంలో ఉన్న చంద్రబాబు కుటుంబానికి రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇక రామ్మూర్తి నాయుడు మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణ వార్త తెలిసి..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు..అక్కడి నుండి హుటాహుటిన హైదరాబాద్ కు రావడం జరిగింది.

అలాగే రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకోవడం జరిగింది. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. తన తమ్ముడి భౌతికకాయం చూసి చంద్రబాబు బోరున విలపించారు. తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి కుమారులు నారా రోహిత్, గిరీశ్ లను అక్కన జేర్చుకుని ఓదార్చారు. తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ ఇద్దరు సోదరులకు పెదనాన్నగా ధైర్యం చెప్పారు. ఈరోజు ఉ.5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని రేణిగుంట ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు తరలిస్తున్నారు. మద్యాహ్నం రాంమూర్తి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొననున్నారు.

Related Posts
Israel-Hamas : గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. 59 మంది మృతి!
Israeli attacks on Gaza.. 59 people killed!

Israel-Hamas : ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా గాజా పై టెల్‌అవీవ్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 50 మందికి పైగా Read more

సాయిపల్లవి ..వార్నింగ్
saipallavi post

తనపై వస్తున్న నిరాధార రూమర్స్ పై సాయిపల్లవి ఘాటుగా స్పందించారు. "నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది" అని హెచ్చరించింది. బాలీవుడ్ లో రణ్ Read more

400 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్
400 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్

భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్, కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీలను తొలగించినట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ఎవాల్యూయేషన్ టెస్ట్ లో Read more

హైదరాబాద్‌లో నకిలీ అల్లం పేస్ట్ దందా: 1500 కిలోల నకిలీ పేస్ట్ స్వాధీనం
GINGER

హైదరాబాద్‌లో పోలీసులు పెద్ద సోదా నిర్వహించి, నకిలీ అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న ఒక గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ నుంచి 1500 Read more