vasireddy padma

గోరంట్ల‌ మాధ‌వ్‌పై పోలీసులకు పిర్యాదు చేసిన వాసిరెడ్డి ప‌ద్మ

వైసీపీని వీడిన ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. తాజాగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. గోరంట్ల మాధవ్ అత్యాచార బాధితుల పేర్లను బహిర్గతం చేయడం అనైతికమని, బాధితుల గోప్యతను ఉల్లంఘించడం దుర్మార్గమని తెలుపుతూ ఆమె పిర్యాదు చేసింది. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె, బాధితుల గౌరవాన్ని కాపాడేందుకు మాధవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళల మీద, అత్యాచార బాధితుల పట్ల సోయిలేకుండా ఒక మాజీ ఎంపీ ఈ విధంగా మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఈ ఘటనకు గురైన బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

వాసిరెడ్డి పద్మ విషయానికి వస్తే..ఏపీ రాజకీయ నాయకురాలు, సమాజసేవకురాలు. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఈమె కీలక భాద్యతలు నిర్వర్తించారు. ఈ పదవిలో ఉన్నప్పుడు, మహిళల హక్కులను రక్షించడానికి, మహిళలపై జరిగే అన్యాయాలను ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టారు. వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రయాణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)తో ప్రారంభించి, ఆ పార్టీతో పాటు ప్రజల సేవలో పనిచేశారు. ఇటీవల ఆమె వైసీపీని వీడి బయటకు రావడం వార్తల్లో నిలిచింది. వైసీపీని వీడిన తర్వాత ఆమె జగన్ పై ఆ పార్టీ విధానాలపై విమర్శలు చేసారు.

Related Posts
ఇంకా మారకపోతే మార్చురీకి పోతారు: కవిత
kavitha comments on cm revanth reddy

హైరదాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు Read more

‘స్వర్ణిమ’ పేరుతో మహిళలకు కొత్త పథకం తీసుకొచ్చిన మోడీ సర్కార్‌
Modi government has brought a new scheme for women named Swarnima

న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పథకాలను గతంలో కూడా Read more

తిరుమలలో 18 మంది టీటీడీ ఉద్యోగులపై బదిలీ వేటు
తిరుమలలో 18 మంది టీటీడీ ఉద్యోగులపై బదిలీ వేటు

తిరుమల కొండపై అన్యమత ప్రచారం ఆ సంస్థలోని అన్యమత ఉద్యోగులపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర చర్యలు తీసుకున్నారు. తిరుమలలో ఈ స‌మ‌యంలో మాంసాహారం, గంజాయి, Read more

వెల్‌వర్క్..కొత్త కార్యాలయ ప్రపంచానికి ఆరంభం
Wellwork..the beginning of a new office world

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో వెల్‌నెస్-సెంట్రిక్ కో-వర్కింగ్ స్పేస్ ప్రారంభం. వెల్‌వర్క్, భారతదేశంలో తొలి వెల్‌నెస్-సెంట్రిక్ కో-వర్కింగ్ స్పేస్‌గా, వృత్తిపరులకు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన పని వాతావరణాన్ని అందిస్తోంది. Read more