srireddy

గుంటూరులో శ్రీ రెడ్డిపై కేసు నమోదు

గత వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని కొంతమంది రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తమ స్థాయిని మరచిపోయి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ ఇలా ఎవర్ని పడితే వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం..వీడియోలు పోస్ట్ చేయడం , ట్రోల్స్ చేయడం వంటివి చేసారు..ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..సైలెంట్ గా ఉంటుందా..వరుసపెట్టి కేసులు పెడుతుంది. ఇప్పటికే అనేకమంది పై కేసులు నమోదు చేయగా..పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం , నోటీసులు జారీ చేయడం చేస్తున్నారు.

కాగా గత సీఎం జగన్ అండ నుచూసుకొనో టీడీపీ , జనసేన , బీజేపీ నేతలే లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. పోస్టులు పెట్టిన సినీ నటి శ్రీ రెడ్డిపై గుంటూరులో కేసు నమోదైంది. మాజీ కార్పోరేటర్ దాసరి జ్యోతి.. శ్రీ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో నగరం పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.

అలాగే హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలపై శ్రీరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై 196, 353(2), 79 BNS, 67 ITA-2000-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలా వరుస కేసులు నమోదు అవుతుండడం తో శ్రీ రెడ్డి తనను క్షేమించండి అంటూ వేడుకోవడం చేస్తుంది.

Related Posts
YS Vivekananda: మా నాన్న కేసులో సాక్షులు చనిపోవడం అనుమానాస్పదమే : సునీత
deaths of witnesses in my father case are suspicious: Sunitha

YS Vivekananda : వైఎస్‌ వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కేసులో Read more

బిహార్ లో మఖానా బోర్డు.. దాని గురించి తెలుసా?
Makhana Board

బిహార్ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటు చేయబడుతుందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత మఖానా గురించి అందరి ఆసక్తి Read more

హరీశ్ వ్యాఖ్యల పై సామ రామ్మోహన్ విమర్శలు
samu

తెలంగాణలో రాజకీయ విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ నేత సామ రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ Read more

బిజెపి నేతతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సెల్ఫీ
MP Shashi Tharoor selfie

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *