gas leak

కొనసాగుతున్న భోపాల్ గ్యాస్ వ్యర్థాల తొలగింపు

భోపాల్ లో 40 ఏళ్ళ క్రితం జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటన వేదన ఇంకా వెంటాడుతున్నది. నిద్రలోనే వేలాది మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఆనాటి దుర్ఘటన ఎవరూ మర్చిపోలేని గాయం అది. అప్పట్లో లీకైన విష వాయువుకు సంబంధించిన వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో జాగ్రత్తగా నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ వ్యర్థాలను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. తొలుత ఫ్యాక్టరీ ఆవరణలో నిల్వ చేసిన సుమారు 377 టన్నుల వ్యర్థాలను పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించి, ఇంజనీరింగ్ నిపుణులతో వాటిని మండించనున్నారు.

Advertisements


3,800 మంది ప్రాణాలు కోల్పోయారు
1984 డిసెంబరు 2 అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ప్రమాదకర మీథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) గ్యాస్ లీక్ అయింది. ఈ విషవాయువు గాలిలో కలిసి ఫ్యాక్టరీ పరిసరాలతో పాటు భోపాల్ సిటీలో వ్యాపించింది. విషవాయువు కారణంగా ఫ్యాక్టరీ కార్మికులతో పాటు భోపాల్ లో మొత్తం 3,800 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంజనీర్ల ఆధ్వర్యంలో ధ్వంసం
ఇందులో భాగంగా బుధవారం రాత్రి విషపూరిత రసాయన వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్లలో లోడ్ చేశారు. వంద మంది కార్మికులు షిప్టుల వారీగా (అరగంట చొప్పున) పనిచేశారు. పని పూర్తయ్యాక కార్మికులకు అధికారులు వైద్య పరీక్షలు చేయించారు.

అనంతరం కంటైనర్ ట్రక్కులు అక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని పిథంపూర్ కు బయలుదేరాయి. ట్రక్కులు జాగ్రత్తగా వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ వ్యర్థాలను రామ్‌కీ ఎన్విరో ఇంజినీరింగ్ కళాశాల ఇంజనీర్ల ఆధ్వర్యంలో ధ్వంసం చేయనున్నారు. ఇందుకు 153 రోజులు పడుతుందని అధికారుల అంచనా.

Related Posts
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు
Imposition of President Rule in Manipur

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ ఇంఫాల్: దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. Read more

Tushar Gandhi: తుషార్‌ గాంధీ అరెస్ట్‌కు బీజేపీ డిమాండ్‌
BJP demands arrest of Tushar Gandhi

Tushar Gandhi: మహాత్మా గాంధీ ముని మనుమడు తుషార్‌ గాంధీని అరెస్ట్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. తుషార్‌ ఇటీవల తిరువనంతపురంలో మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్‌ చాలా Read more

Chiranjeevi : చిరంజీవి మీరొక ఛాంపియన్ అంటూ చంద్రబాబు ట్వీట్
Chiranjeevi చిరంజీవి మీరొక ఛాంపియన్ అంటూ చంద్రబాబు ట్వీట్

Chiranjeevi : చిరంజీవి మీరొక ఛాంపియన్ అంటూ చంద్రబాబు ట్వీట్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటులో ఘన సన్మానం జరగడం సినీ పరిశ్రమలో మైలురాయి Read more

భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం
భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం

యూరోపియన్ యూనియన్ (EU) భద్రత, రక్షణ, వాణిజ్య రంగాల్లో భారత్‌తో సహకారం పెంచేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలో, EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ Read more

×