cm revanth ryathu sabha

కేటీఆర్ , హరీష్ రావు లది చిన్నపిల్లల మనస్తత్వం- సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో పేదల కోసం ఏమీ చేయని బిఆర్ఎస్ పార్టీ తమ ఏడాది పాలనపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఎన్నికల కోడ్ వల్ల మొదటి ఐదు నెలలు కార్యాలయానికి వెళ్ళలేకపోయామని, ఆ తరువాతి ఆరు నెలల్లో పరిపాలనను గాడిలో పెట్టామని తెలిపారు.

“కేటీఆర్, హరీష్ చిన్నపిల్లల మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు” అని రేవంత్ అన్నారు. “మన దగ్గర లేని బొమ్మ పక్కోడి దగ్గర ఉంటే విరగ్గొట్టాలని చిన్నపిల్లలు ప్రయత్నిస్తారు. అలానే బిఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు. వారికి అర్ధం కాకపోవచ్చు కానీ కెసిఆర్కి కూడా అవగాహన లేకపోవడం విచిత్రం” అని ఆయన ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ హయాంలో పేదల ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. “కెసిఆర్ తన అవసరాలకు ప్రగతిభవన్, సచివాలయం, బిఆర్ఎస్ కార్యాలయాలు నిర్మించుకోవడంలో వేగంగా పని చేశారు. కానీ పేదల కోసం ఇళ్లు కట్టించడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు” అని విమర్శించారు.

“మేం ఏడాది లోపే అనేక పథకాలను అమలు చేశాం. ప్రజల సంక్షేమానికి మా పాలన కట్టుబడి ఉంది. BRS నేతల విమర్శలు అవాస్తవాలు” అని రేవంత్ స్పష్టం చేశారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు అనేక కొత్త పథకాలు తీసుకురావడం తమ పాలన విజయమని తెలిపారు. ఇక మీదట కూడా పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు.

Related Posts
అల్లుఅర్జున్ జైల్లో ఓ రాత్రి
Allu Arjun Reaching Jubilee Hills Residence 380x214

అల్లుఅర్జున్ జైల్లో రాత్రి భోజనం చేయకుండా నిద్రించినట్లు తెలిసింది. రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లుఅర్జున్ను ఖైదీలందరూ బ్యారక్లకు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్కు తరలించారు. జైలు అధికారులు Read more

గాయంతో హీరోయిన్ రష్మిక..ఫొటోస్ వైరల్
rashmika gayam

జిమ్‌లో గాయపడిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక తన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె గాయపడిన నేపథ్యంలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. Read more

వ‌రంగల్ ప‌ర్య‌ట‌న‌పై సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్
cm revanth

సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు Read more

రాహుల్ గాంధీపై పౌరసత్వ వివాదం…
Rahul Gandhi

ఈ మధ్య కాలంలో అలహాబాద్ హైకోర్టు హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ పిటిషన్ లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ Read more