raghuram pawa

కర్మ అంటే ఇదే… రఘురామ – డిప్యూటీ సీఎం పవన్

కర్మ ఫలం ఎవర్ని వదిలిపెట్టదని..ఎప్పుడు.. ఎలా జరగాలో అదే జరుగుతుందని..ఈ విషయంలో రఘురామకృష్ణం రాజే ఉదాహరణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గురువారం ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కె. రఘురామకృష్ణరాజు ప్రకటన అనంతరం డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగుపెట్టనివ్వబోమని సవాల్ చేసిన వారు ఈరోజు మీ ముందు అసెంబ్లీలోనే లేరని… కర్మ అంటే ఇదే. రఘురామ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నిక కాగా, రఘురామ ముందుకు వారు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది దేవుడు రాసిన స్క్రిప్టు… ఇది ప్రజాస్వామ్యం గొప్పదనం అని పవన్ వివరించారు.

“గత ప్రభుత్వంలో మనమందరం ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం… గత ప్రభుత్వ హయాంలో రాజకీయాలు కలుషితం అయ్యాయి… ఎన్ని కష్టాలు ఎదురైనా మీ పోరాట పటిమ అభినందనీయం… ఉండి అసెంబ్లీ స్థానం నుంచి 56 వేలకు పైగా మెజారిటీతో మీరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆ పదవికి వన్నె తెచ్చి, సభను గౌరవ సభగా ఉన్నత స్థానానికి చేర్చుతారని ఆశిస్తున్నాను. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదని 2014లో వారిని నిలువరించామన్నారు. అయితే 2019లో అలా కుదరలేదని.. ఆ సమయంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగాయని అన్నారు.

సుప్రీంకోర్టు జడ్జీలు, పార్టీల్లోని కార్యకర్తలు, సొంత పార్టీ ఎంపీ అయిన ట్రిపుల్ ఆర్‌ను వారు వదల లేదన్నారు. ఆయన్ని శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా హింసించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ట్రిపుల్ ఆర్‌ను అరెస్ట్ చేస్తారనుకున్నాం.. కానీ థర్డ్ డిగ్రీ మెథడ్ వాడడంతో భయం కలిగిందన్నారు. దీంతో తామకు ఆవేదన కలిగిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న తన కోరిక వల్లే.. నేడు డిప్యూటీ స్పీకర్‌గా మిమ్మల్ని చూస్తున్నామని పవన్ పేర్కొన్నారు. అందరం కలసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఈ సభకు ధన్యవాదాలు తెలిపారు. ఇక మీ మాటకు పదనుతోపాటు హస్యం సైతం ఉంటుందన్నారు.

Related Posts
కెనడా: భారతీయ ప్రయాణికులపై అదనపు భద్రతా తనిఖీలు
canadaextra security

కెనడా ఎయిర్ ట్రాన్సపోర్ట్ సెక్యూరిటీ అథారిటీ (CATSA) భారతీయ ప్రయాణికుల కోసం అదనపు స్క్రీనింగ్ చర్యలను చేపట్టనుంది. కెనడాకు విమాన ప్రయాణం చేసే భారతీయ పాసింజర్లు, వీసా Read more

ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఇకపై 5 శాతం ఐఆర్ – సీఎం రేవంత్
telangana announces interim

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బేసిక్ శాలరీపై 5శాతం పెంచింది. ప్రభుత్వ రంగ Read more

రెండు స్టేజీలలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
We will complete the Visakha Metro Rail project in two stages. Minister Narayana

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైల్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ మాట్లాడుతూ..మెట్రో పాలసీ Read more

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు హైకోర్టులో ఊరట
gaddamprasad

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019లో ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో Read more