AP High Court appoints three new judges copy

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకం..

అమరావతి: ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియవితులయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులోనే న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లను అదనపు జడ్జిలుగా నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది.

Advertisements

వీరి నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో చర్చించిన తర్వాత వీరిని ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. అలాగే, కర్ణాటక హైకోర్టులో అదనపు జడ్జిగా ఉన్న జస్టిస్‌ సిద్ధయ్య రాచయ్యను అదే హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమించినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. వీరిలో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నరేందర్‌ పేరును ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉంది.

Related Posts
సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు
Sankranti holidays announced by Inter Board

హైరదాబాద్‌: తెలంగాణలో జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈమేరకు జనవరి 7న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈసారి మొత్తంగా ఇంటర్ కాలేజీలకు Read more

Results: ఈ నెలాఖరులో టెన్త్, ఇంటర్‌ ఫలితాలు విడుదల
Results: ఈ నెలాఖరులో టెన్త్, ఇంటర్‌ ఫలితాలు విడుదల

పదో తరగతి, ఇంటర్ ఫలితాలపై విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ ఈ సంవత్సరం పదో తరగతి మరియు ఇంటర్ పరీక్షలు పూర్తయిన వెంటనే, తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు తమ Read more

మరోసారి సమ్మె బాట పట్టిన బెంగాల్ వైద్యులు
bengal doctor back on strike announced total cease work from today

bengal-doctor-back-on-strike-announced-total-cease-work-from-today కోల్‌కతా: కోల్ కతాలో ట్రెయినీ డాక్టర్ అత్యాచారం ఘటన తర్వాత ఆందోళన చేపట్టిన జూనియర్ డాక్టర్లు వారం కిందట తాత్కాలికంగా నిరసన విరమించిన విషయం తెలిసిందే. Read more

All-party meeting : ఉగ్రదాడి ఘటన…నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
Terror attack incident…All party meeting in Delhi today

All-party meeting : జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు Read more

Advertisements
×