Will march across the state. KTR key announcement

ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్టు చేస్తారని ఎప్పుడో తెలుసు : కేటీఆర్‌

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి మండిపడ్డారు. లగచర్ల ఘటనలో కుట్ర జరిగిందని చెబుతుండటంపై కేటీఆర్‌ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్టు చేస్తారని ఎప్పుడో తెలుసు’ అని కేటీఆర్‌ అన్నారు. రైతుల గొంతుకైనందుకు అరెస్ట్‌ చేస్తే గర్వంగా జైలు కెళ్తానన్నారు. ‘కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు.. అరెస్ట్‌ చేస్కో రేవంత్‌రెడ్డి’ అని సవాల్ విసిరారు.

”ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అల్లుడు, అన్న కోసం.. రైతన్న నోట్లో మట్టికొట్టడం కుట్ర కాదా?9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డున పడేయడం కుట్ర కాదా?మర్లపడ రైతులు ఎదురు తిరిగినందుకు చిత్రహింసలు పెట్టారు.” అని కేటీఆర్‌ ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? రూ.50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో” అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

Related Posts
గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు అతిథిగా ఇండోనేషియా అధ్య‌క్షుడు
Prabowo Subianto

భార‌త 76వ గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌ల‌కు ఇండోనేషియా అధ్య‌క్షుడు ప్ర‌బోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఈ విష‌యాన్ని భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా Read more

విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
Central Election Commission

అమరావతి: ఏపీలో విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల Read more

యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన మోడీ
narendra modi

భారత యుద్ధనౌకలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి కొద్దిసేపటి ప్రధాని మోడీ జాతికి అంకితం చేసారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్- నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్‌షేర్ Read more