CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

ఈ నెల 8 నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర

హైదరాబాద్‌: సిఎం రేవంత్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు సీఎం సిద్ధమయ్యారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మూసీ పునరుజ్జీవం యాత్రతో మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్లనున్నారు. తన జన్మదినం నవంబర్ 8 నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం శ్రీకారం చుట్టారు. అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలు చేయనున్నారు సీఎం రేవంత్. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ముఖ్యమంత్రి పర్యటన షురూ కానుంది. ఈ నెల 8న కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

అనంతరం వైటీడీఏ , జిల్లా అధికారులతో ఆలయ అభివృద్ధి పనులపై రేవంత్ సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య పాదయాత్ర చేయనున్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నారు సీఎం. తరువాత మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్ లైన్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యవేక్షించనున్నారు.

Related Posts
కాకినాడ షిప్‌లో మరోసారి తనిఖీలు
Once again checks on Kakina

కాకినాడ : కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుందన్న ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక షిప్ ను స్వాధీనం Read more

సీతారామన్‌కు CII బడ్జెట్ సూచనలు
సీతారామన్ కు CII బడ్జెట్ సూచనలు

ప్రముఖ పరిశ్రమల సమాఖ్య (CII) కేంద్ర బడ్జెట్ 2025-26 ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా తక్కువ ఆదాయ స్థాయిలో వినియోగాన్ని Read more

నటుడు సోనూ సూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం
Sankalp Kiron award to actor Sonu Sood

హైదరాబాద్‌: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గురువారం సాయంత్రం నాంపల్లిలోని లలిత కళా తోరణం లో జరిగిన ఈ కార్యక్రమంలో Read more

జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం
జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుభాష్‌నగర్‌లో ఉన్న ప్లాస్టిక్ ట్రే గోదాంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. Read more