బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. ఈ అత్యంత కీలకమైన పోరు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా జరగనుంది.ప్రస్తుత సిరీస్ 1-1 సమతూకంలో ఉన్నందున ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో ప్రాధాన్యం కలిగింది.గెలిచి ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో ఇరు జట్లు సన్నాహకాల్లో మునిగిపోయాయి. ఈ మ్యాచ్లో అందరి చూపు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఉండనుంది. ఇటీవల వరుస వైఫల్యాల కారణంగా కోహ్లీ దశ మారుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో, కోహ్లీ తన ప్రదర్శనతో మళ్లీ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మెల్బోర్న్ మైదానం విరాట్ కోహ్లీకి స్పెషల్ వేదిక.
ఈ మ్యాచ్లో మరో 134 పరుగులు సాధిస్తే, కోహ్లీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంసీజీ మైదానంలో సచిన్ 449 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ 316 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.కాగా, ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి మరిన్ని అవకాశాలను తెరచే వేదికగా నిలుస్తుంది.తన ఫామ్ను మళ్లీ పొందాలని చూస్తున్న కోహ్లీ, ఈ మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నా, గత కొంతకాలంగా మాత్రం ఫామ్ లేక అభిమానులను నిరాశపరుస్తున్నాడు. పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 5 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించి మంచి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే ఆ తర్వాతి రెండు టెస్టుల్లో తీవ్రంగా విఫలమయ్యాడు.రెండో టెస్టు: 7,11 పరుగులు మూడో టెస్టు: 3 పరుగులు మొత్తం ఐదు ఇన్నింగ్స్ల్లో కలిపి కోహ్లీ కేవలం 126 పరుగులు మాత్రమే సాధించడం అతని అభిమానులను ఆందోళనకు గురిచేసింది.మెల్బోర్న్ గ్రౌండ్లో కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.