Rs.20 lakhs is available in

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షలు లభ్యం..ఎక్కడివో తెలుసా..?

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షలు లభ్యం కావడం అందర్నీ షాక్ కు గురిచేసింది. కాకపోతే ఇదంతా కూడా దొంగసొమ్ము అని తేలింది. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో తాను పనిచేస్తున్న ఓ కంపెనీలో రూ.20 లక్షలకు పైగా నగదు దొంగతనం చేశాడు. ఈ డబ్బుని తన బావకు ఇచ్చి స్వగ్రామానికి పంపించాడు. కంపెనీ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఒడిశా వెళ్లారు. అక్కడి పోలీసుల సాయం తీసుకొని… బాలాసోర్ జిల్లాలో ఉన్న అతడి విచారించగా.. నిందితుడి అత్తమామల ఇంట్లోని ఆవు పేడ కుప్పలో ఈ డబ్బును దాచిపెట్టినట్టు గుర్తించారు. కొట్టేసిన నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. కమర్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదమందరుని గ్రామంలో రికవరీ చేసినట్లు వివరించారు.

డబ్బు కొట్టేసిన నిందితుడు పేరు గోపాల్ బెహెరా అని, అతడి అత్తమామల ఇంట్లో సోదాలు నిర్వహించామని చెప్పారు. గోపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న వ్యవసాయ అనుబంధ కంపెనీలో పనిచేస్తూ లాకర్‌లో ఉన్న రూ.20 లక్షలకు పైగా నగదు దొంగతనం చేశాడని వెల్లడించారు. డబ్బుని తన బావ రవీంద్ర బెహెరా చేతికి ఇచ్చి గ్రామానికి పంపించాడని, కంపెనీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా డబ్బు పట్టుబడిందని కమర్డ పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రేమదా నాయక్ ప్రకటించారు. నిందితులు గోపాల్, అతడి బావ రవీంద్ర ఇద్దరూ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.

Related Posts
మహా కుంభమేళా ఆదాయం 3 లక్షల కోట్లకు పైగా
మహా కుంభమేళా ఆదాయం 3 లక్షల కోట్లకు పైగా

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా మహా శివరాత్రి సంద‌ర్భంగా నిన్న‌టితో ముగిసింది. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మంలో Read more

వరల్డ్ స్ట్రోక్ డే 2024: స్ట్రోక్ సంఘటనలు పెరుగుతున్నందున పునరావాస మరియు పునరుద్ధరణ కేంద్రాల యొక్క అత్యవసర అవసరాన్ని వెల్లడించిన హెచ్‌సిఏహెచ్
World Stroke Day 2024. HCAH reveals urgent need for rehabilitation and recovery centers as stroke incidence rises

హైదరాబాద్: ప్రపంచ స్ట్రోక్ డే 2024 న, తెలంగాణలో స్ట్రోక్ కేసుల ప్రాబల్యం పై ప్రధానంగా దృష్టి సారించింది , ఇది రక్తపోటు, మధుమేహం, ధూమపానం మరియు Read more

ఛాంపియన్స్ ట్రోఫీ పై ఐదు వేల కోట్ల బెట్టింగ్
ఛాంపియన్స్ ట్రోఫీ పై ఐదు వేల కోట్ల బెట్టింగ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా భారత్ ,న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో జరగనుంది. ఈ క్రికెట్ మెగా ఈవెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా Read more

రాజస్థాన్ కోటాలో కొత్త నిబంధనలు
రాజస్థాన్ కోటాలో కొత్త నిబంధనలు

కోటా జిల్లాలో కొత్త మార్గదర్శకాలు: ఆత్మహత్యలు నివారించేందుకు కీలక నిర్ణయాలు రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా జిల్లా, విద్యార్థుల కోచింగ్ పరీక్షల కోసం ప్రసిద్దమైన ప్రాంతంగా సురక్షితమైన. కోచింగ్ Read more