Home Minister Anitha inaugu

ఆరిలోవ లో నూతన పోలీస్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి అనిత

ఆరిలోవ హనుమంతువాక వద్ద ఎకరం స్థలంలో 17 గదులతో విశాలముగా నిర్మించిన ఆరిలోవ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఆదివారం రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమములో భాగంగా మంత్రి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన చేసి నూతన పోలీస్ స్టేషన్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆరిలోవ పోలీస్ స్టేషన్ అంటేనే అందరికీ జాలి ఉండేదని, తుఫాన్ షెల్టర్ భవనంలో ఎప్పుడు ఉంటుందో… ఎ ప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ ఉండేదని, 2018లో శంకుస్థాపన జరిగినా కూడా ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి నోచుకోని దాకానే లేదని తెలిపారు. కూ టమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ శాఖ పై ప్రత్యేక దృష్టి పెట్టి మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. సమాజంలో గుడి, బడి తో పాటు పోలీస్ స్టేషన్ కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు.


ఈ భవనంలో ఏసీబీ కార్యాలయం నిర్మాణం కోసం అదనపు అంతస్తూ నిర్మించడానికి 2.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు కోసం ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ ఇచ్చిన డివిస్ లేబరేటరీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేద ప్రజలకు మేలు జరుగుతుందని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిపించే ఘనత చంద్రబాబు దేనని తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద మెరుగైన రహదారి నిమిత్తం జీవీఎంసీ నుండి కోటి రూపాయల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ శంఖబ్రత బాగ్చ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, డీసీపీ అజిత్, డి ఐ జి గోపీనాథ్, ఏసీబీ అన్నపు నరసింహమూర్తి, ఆరిలోవ సి ఐ హెచ్ మల్లేశ్వరరావు తో పాటు పోలీసు ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts
సీఎం ప్రోద్భలంతోనే దాడులు : ఎమ్మెల్సీ కవిత
Attacks at the instigation of CM Revanth Reddy: MLC Kavitha

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై NSUI, కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత ఖండించారు. కాంగ్రెస్ Read more

ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి: రాజ్‌నాథ్ సింగ్‌కు లోకేశ్ విజ్ఞప్తి
Set up defense cluster in AP.. Lokesh appeals to Rajnath Singh

న్యూఢిల్లీ: రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా నారా లోకేశ్ ఈనెల Read more

సూర్యప్రభ వాహనంపై దేవదేవుని కటాక్షం
సూర్యప్రభ వాహనంపై దేవదేవుని కటాక్షం

తిరుమల క్షేత్రంలో సూర్య జయంతి వేడుక వైభవంగా ముగిసింది రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమినాడు జరిగే ఈ ఉత్సవం Read more

డిసెంబరులో 6 విమాన ప్రమాదాలు 234 మరణాలు
డిసెంబరులో 6 విమాన ప్రమాదాలు, 234 మరణాలు

డిసెంబర్ నెలలో వరుసగా జరిగిన ఘోరమైన విమాన ప్రమాదాలు విమానయాన భద్రతపై గంభీర ప్రశ్నలను లేవనెత్తాయి. మొత్తం 6 ప్రధాన సంఘటనల్లో 234 మంది మరణించడం తీవ్ర Read more