allu arjun in the new poster of pushpa 2 photo instagram allu arjun 175434431 16x9 0

అల్లు అర్జున్ అరెస్టైన వేళలో కలెక్షన్ల హవా

అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్ అయి, శనివారం ఉదయం విడుదల అయ్యారు. ఈ సంఘటనతో శుక్రవారం ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.36.25 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ సినిమా హవా కొనసాగుతోంది. పుష్ప-2 విజయానందంలో ఉన్న అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసులో ఓ మహిళ మరణించగా వారి కుమారుడు గాయపడి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం రాత్రి ఆయన చంచల్‌గూడ జైలులో గడిపారు. సరిగ్గా ఇదే రోజు.. అంటే పుష్ప-2 విడుదలైన 9వ రోజైన శుక్రవారం ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.36.25 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ సినిమా హవా కొనసాగుతోంది.
సినిమా కలెక్షన్లను ట్రాక్ చేసే ‘శాక్‌నిల్క్’ కథనం ప్రకారం.. ఈ మూవీ శుక్రవారం హిందీ వెర్షన్‌లో రూ.27 కోట్లు, తెలుగు వెర్షన్‌లో రూ.7.5 కోట్లు, తమిళంలో రూ.1.35 కోట్లు, కన్నడ, మలయాళంలో రూ.0.2 కోట్లు రాబట్టింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం రూ.762.1 కోట్లకుపైగా రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.1067 కోట్లు రాబట్టింది.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్లను అధిగమించేందుకు పుష్ప-2 సమీపిస్తోందని సినీ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీకెండ్‌ అయిన శని, ఆదివారాల్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
కాగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్’లో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్‌తో పాటు పలువురు అగ్రనటులు నటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత వేగంగా రూ.1000 వసూళ్ల మైలురాయి చేరుకున్న సినిమాగా పుష్ప-2 నిలిచిన విషయం తెలిసిందే.

Related Posts
ఎన్నికల్లో ఒంటరిగా పోటీ: సంజయ్ రౌత్
sanjay raut

ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయిని శివసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. ‘ఇండియా’ బ్లాక్, మహా Read more

కర్ణాటకలో మరో ఘోర ప్రమాదం..10 మంది మృతి
10 dead after fruit and veg

కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలూకాలోని గుల్లాపుర ఘట్ట జాతీయ రహదారిపై ఒక కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ Read more

AI విశ్వవిద్యాలయం ఏర్పాటుకు టాస్క్‌ఫోర్స్‌: మహారాష్ట్ర
ashish shelar

దేశంలోని మొట్టమొదటి AI విశ్వవిద్యాలయం ప్రణాళిక అమలు కోసం మహారాష్ట్ర ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ విశ్వవిద్యాలయం AI సంబంధిత రంగాలలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని Read more

Maha Kumbh: కోట్ల ఆదాయం..సంతోషం-ఆదాయపన్నుతో ఆవిరి
Maha Kumbh: కోట్ల ఆదాయం.. సంతోషం – ఐటీ నోటీసుతో ఆవిరి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి భక్తుల తాకిడి కాదు, ఓ బోటు కుటుంబం రూ. 30 కోట్ల ఆదాయం పొందడం, Read more