diesel

అమెరికా దెబ్బకు భారత్, చైనా విలవిల

సుదీర్ఘంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని అడ్డుకోవాల్సింది పోయి ఎగదోస్తున్న అగ్రరాజ్యం.. ఇప్పుడు ఆ యుద్ధం విషయంలో తటస్థంగా ఉంటున్న దేశాల్ని సైతం కెలుకుతోంది. ఇందులో భాగంగా యుద్దంలో రష్యాకు అండగా నిలుస్తున్న చమురు ఆదాయానికి గండి కొట్టేందుకు భారీ ఆంక్షలు విధించింది. దీని ప్రభావం ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలైన భారత్, చైనాపై పడింది. రష్యాకు సహజ మిత్రులైన భారత్, చైనా గతంలో అమెరికా విధించిన ఆంక్షల్ని లెక్కచేయకుండా ఆ దేశం నుంచి చమురు కొన్నాయి. దీంతో తన అవసరాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రష్యా వీరిద్దరికీ డిస్కౌంట్ పై భారీగా చమురు అమ్మింది. ఇదంతా చూస్తూ వస్తున్న అమెరికా తాజాగా రష్యా చమురు రిఫైనరీలు, ఆ చమురును రవాణా చేసే నౌకలు, వారి ఇన్సూరెన్స్ సంస్థలపై భారీ ఆంక్షలు విధించింది.

Advertisements


ఈ నేపథ్యంలో భారత్, చైనాకు రష్యా చమురు సరఫరా నిలిచిపోతోంది. ఇన్నాళ్లూ రష్యా చమురు డిస్కౌంట్ పై వస్తుండటంతో మిగతా ప్రత్యామ్నాయాలపై పెద్దగా దృష్టిపెట్టని ఇరుదేశాలు ఇప్పుడు తప్పనిసరిగా ఆలోచనలో పడ్డాయి. ప్రత్యామ్నాయంగా తమకు చమురు సరఫరా చేసే మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. ఎలాగో అమెరికా కోపం రష్యాపైనే కాబట్టి ఇతర మార్గాల్లో చమురును తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాయి. ఈ ప్రభావం ధరలపై పడే అవకాశాలు కనిపిస్తోంది. గతంలో చమురు సరఫరా దేశాలైన గ్రూప్ ఆఫ్ సెవెన్ ఆంక్షలు, పరిమితుల వల్ల రష్యా నుంచి చమురు ఎగుమతులు రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ యూరప్ దేశాల నుంచి ఆసియాకు మళ్లించారు. అయితే అమెరికా తాజా ఆంక్షలు అమల్లోకి వచ్చినా 600 ట్యాంకర్ల రష్యా రహస్య నౌకల కారణంగా స్వల్పకాలిక ప్రభావాలను తగ్గించవచ్చని విశ్లేషకుల అంచనా . చైనా, రష్యా , సింగపూర్ సమీపంలో కనీసం 65 రష్యా ఆయిల్ ట్యాంకర్లు ఇప్పుడు చేరుకుని ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts
ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు మద్రాసు హైకోర్టు ప్రశ్న
Madras High Court question to spiritual guru Jaggi Vasudev

Madras High Court question to spiritual guru Jaggi Vasudev న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఇషా ఫౌండేషన్‌పై మద్రాసు హైకోర్టు సీరియస్ Read more

నేడు కెనడా, మెక్సికో, చైనా టారిఫ్‌లను విధించనున్న ట్రంప్
trump

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు అతిపెద్ద US వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో మరియు చైనాపై నేడు సుంకాలను అమలు చేయనున్నారు. వివిధ పరిశ్రమలపై మరింత సుంకాలను Read more

4 గ్రహాలను గుర్తించే అరుదైన అవకాశం!
4 గ్రహాలను గుర్తించే అరుదైన అవకాశం!

ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా (పిఎస్ఐ) వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. శ్రీ రఘునాథన్ కుమార్ సలహా ఇస్తూ, "6 నుండి 7 గ్రహాల దృశ్యమానత గురించి కొన్ని Read more

భద్రతా సమావేశంలో నెతన్యాహు కీలక చర్చ
netanyahu

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు సఫెద్‌లోని ఐడీఎఫ్ ఉత్తర కమాండ్ ప్రధాన కార్యాలయంలో తన భద్రతా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక Read more

Advertisements
×