తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు పెద్ద హిట్ కొట్టిన హీరోయిన్ గురించి చెప్పుకుంటే, ఆమె పేరు గుర్తు , పట్టకపోవచ్చు కానీ ఆమె అభిమానులు మాత్రం ఇప్పటికీ ఆమెను గుర్తిస్తారు. టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే సంచలనం సృష్టించి, బిజీ హీరోయిన్గా ఎదిగే అవకాశం ఉండగా, అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. మరి, ఆమె ఎవరో తెలుసా? ఆమె పేరు మిస్త్రీ చక్రవర్తి. 2013లో విడుదలైన “పొరిచేయ్” అనే చిత్రంతో బెంగాలీ సినిమా రంగంలో అడుగుపెట్టింది. ఈ చిత్రం ఆమెకు విపరీతమైన ఫేమ్ తీసుకొచ్చింది. దాని తర్వాత, ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది.అంతేకాకుండా, ఆమె సుదీర్ఘ కాలం పాటు తెలుగులో, కన్నడ, మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది.తెలుగులో, నితిన్ సరసన”చిన్నదాన నీకోసం”చిత్రంలో నటించి టాలీవుడ్లో పరిచయమైంది. కానీ ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలకు దూరమైంది.
ఇప్పటి వరకు ఆమె చాలా సున్నితమైన, బ్యూటిఫుల్ ఇమేజ్తో పాపులర్ అయింది.కానీ ఇప్పుడు ఆమె గ్లామర్ లుక్తో నెటిజన్లను అతి ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం, ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ, ఎప్పటికప్పుడు ఫోటోస్, పోస్ట్లు అప్డేట్ చేస్తూ అందరికీ అందిస్తోంది.ఈ గ్లామర్ క్వీన్ కొత్త లుక్ను చూసి నెటిజన్లు బాగా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ,ఇప్పుడు తన కొత్త స్టైల్తో నిజంగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఆమెని జ్ఞాపకంలో ఉంచుకున్న చాలా మంది ఈ మార్పును చూసి మరింత ఆసక్తిగా ఉంటున్నారు.తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషలలో అనేక సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న మిస్త్రీ చక్రవర్తి, తెలుగులో నితిన్ సరసన “చిన్నదాన నీకోసం” చిత్రంతో టాలీవుడ్లో పరిచయమైంది. కానీ ఆ తరువాత తెలుగులో ఇంకో సినిమా చేయలేదు.అందం, అభినయంతో కుర్రాళ్ల మతిపోగొట్టిన ఈ హీరోయిన్ ఇప్పుడు సినిమా పరిశ్రమలో దూరంగా ఉన్నా, తన సోషల్ మీడియా ప్రిజెన్స్తో ఫాన్స్ని అలరించుకుంటోంది.