Muhammad Yunus : చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం వారిద్దరూ సమావేశమయ్యారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం యూనస్ చైనాకు వెళ్లారు. బుధవారం హైనాన్ ప్రావిన్స్లో బోవో ఫోరమ్ ఫర్ ఆసియా వార్షిక సదస్సులో యూనస్ పాల్గొన్నారు. అనంతరం చైనా రాజధాని బీజింగ్ చేరుకొని, ఆ దేశ ప్రతినిధులతో సమావేశమయ్యారు. డ్రాగన్ ఇస్తున్న రుణాలకు వడ్డీలను తగ్గించాలని, ఆ దేశ నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్మెంట్ ఫీజ్ను మాఫీ చేయాలని కోరారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలన్నారు. జపాన్, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు తర్వాత చైనా దగ్గరినుంచే బంగ్లా ఎక్కువగా రుణాలు పొందుతోంది. 1975 నుంచి ఇప్పటివరకు పొందిన అప్పులు 7.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

అనేక అవగాహన ఒప్పందాలు
కాగా, షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత నుంచి భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. చిరకాల మిత్రదేశమైన భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్, చైనాకు దగ్గరవుతూ వస్తోంది. ఇక, ఈ పర్యటన యొక్క ప్రధాన దృష్టి ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం ఈ పర్యటన సందర్భంగా అనేక (అవగాహన ఒప్పందాలు) కుదుర్చుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఈ అవగాహన ఒప్పందాలు ఎక్కువగా ఆర్థిక సహకార రంగాలను కవర్ చేస్తాయి, “చర్చ యొక్క ప్రధాన కేంద్రాలలో ఒకటి మా అంకితమైన చైనీస్ ఆర్థిక మండలంలో చైనా నుండి మరిన్ని పెట్టుబడులను తీసుకురావడం” అని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. చైనా పర్యటన చాలా ముఖ్యమైనది. ప్రధాన సలహాదారుగా యూనస్ ఏ దేశానికైనా చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది “చైనాతో సంబంధాన్ని పెంచుకోవడానికి మరియు సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను అన్వేషించడానికి బంగ్లాదేశ్కు ఇది ఒక అవకాశం”