Yunus meets with Chinese President Jinping

Muhammad Yunus : ముహమ్మద్ యూనస్‌-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ: ఏం చర్చించారు?

Muhammad Yunus : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం వారిద్దరూ సమావేశమయ్యారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం యూనస్‌ చైనాకు వెళ్లారు. బుధవారం హైనాన్ ప్రావిన్స్‌లో బోవో ఫోరమ్‌ ఫర్ ఆసియా వార్షిక సదస్సులో యూనస్ పాల్గొన్నారు. అనంతరం చైనా రాజధాని బీజింగ్ చేరుకొని, ఆ దేశ ప్రతినిధులతో సమావేశమయ్యారు. డ్రాగన్ ఇస్తున్న రుణాలకు వడ్డీలను తగ్గించాలని, ఆ దేశ నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్‌మెంట్ ఫీజ్‌ను మాఫీ చేయాలని కోరారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలన్నారు. జపాన్‌, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు తర్వాత చైనా దగ్గరినుంచే బంగ్లా ఎక్కువగా రుణాలు పొందుతోంది. 1975 నుంచి ఇప్పటివరకు పొందిన అప్పులు 7.5 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

Advertisements
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో యూనస్‌

అనేక అవగాహన ఒప్పందాలు

కాగా, షేక్‌ హసీనా ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత నుంచి భారత్‌-బంగ్లాదేశ్‌ సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. చిరకాల మిత్రదేశమైన భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌, చైనాకు దగ్గరవుతూ వస్తోంది. ఇక, ఈ పర్యటన యొక్క ప్రధాన దృష్టి ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం ఈ పర్యటన సందర్భంగా అనేక (అవగాహన ఒప్పందాలు) కుదుర్చుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఈ అవగాహన ఒప్పందాలు ఎక్కువగా ఆర్థిక సహకార రంగాలను కవర్ చేస్తాయి, “చర్చ యొక్క ప్రధాన కేంద్రాలలో ఒకటి మా అంకితమైన చైనీస్ ఆర్థిక మండలంలో చైనా నుండి మరిన్ని పెట్టుబడులను తీసుకురావడం” అని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. చైనా పర్యటన చాలా ముఖ్యమైనది. ప్రధాన సలహాదారుగా యూనస్ ఏ దేశానికైనా చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది “చైనాతో సంబంధాన్ని పెంచుకోవడానికి మరియు సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను అన్వేషించడానికి బంగ్లాదేశ్‌కు ఇది ఒక అవకాశం”

Related Posts
Harish Rao : కేసీఆర్ చావు కోరుకోవడం దారుణం : హరీశ్ రావు
Wishing KCR death is cruel.. Harish Rao

Harish Rao : తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్‌ చావును కోరుకోవడం ఎంత దారుణమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే Read more

Reservoirs : అడుగంటుతున్న ప్రాజెక్టులు
Reservoirs

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలు వేసవి తీవ్రతతో నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉమ్మడి జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకీ గణనీయంగా తగ్గిపోతున్నాయి. కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం Read more

Women :30 ఏళ్లు దాటిన మహిళలకు అలర్ట్!
30 years above woman

ఇల్లంతా సక్రమంగా నడవాలంటే మహిళ ఆరోగ్యంగా ఉండడం అత్యంత అవసరం. ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే మహిళలకు ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో, 30 ఏళ్లు Read more

Congress : అసెంబ్లీని గౌరవ సభగా కాంగ్రెస్ పార్టీ మార్చింది : శ్రీనివాస్ గౌడ్
Congress party has turned the Assembly into a house of honour.. Srinivas Goud

Congress : అసెంబ్లీని కౌరవ సభలాగా కాంగ్రెస్ పార్టీ మార్చింది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్పీకర్‌ను జగదీష్ రెడ్డి అవమానించలేదు. ఎక్కడా లేని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×