Telangana: యూట్యూబర్ పై మహిళల దాడి

Telangana: యూట్యూబర్ పై మహిళల దాడి

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో యూట్యూబర్ గిరీష్ దారమోని పై జరిగిన దాడి కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మొత్తం 45 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా మిగిలిన 40 మందిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది.వివాదాస్పద అంశాల్లో దూరి కేసులు దాకా తెచ్చుకుంటున్నారు కొంతమంది యూట్యూబర్లు. అయితే హద్దు దాటితే సెక్షన్లతో కొడుతోంది డిపార్ట్‌మెంట్‌. తాజాగా తెలుగు యూట్యూబర్ పై పలువురు యువకులు, మహిళలు మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అత్తాపూర్ రాధకృష్ణానగర్ లో జరిగింది.

Advertisements

దర్యాప్తు

యూట్యూబర్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబర్‌ గిరీష్‌పై దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బంది విధులను అడ్డుకోవడంతో పాటు దాడి చేసిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. మొత్తం 45 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 40 మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు తనపై, తన కార్యాలయంపై ప్లాన్‌ ప్రకారమే దాడి జరిగిందని ఆరోపించారు యూట్యూబర్‌ గిరీష్‌.

చిత్రగుప్త్

రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్ గూడలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న యూట్యూబర్ గిరీష్ దారమోని, ద చిత్రగుప్త్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై నిలదీసేందుకు ఇంటికెళ్లిన వారిపై కారంపొడితో గిరీష్‌ దాడి చేశారు.దీనితో అక్కడున్న యువకులు, మహిళలు మూకుమ్మడిగా గిరీష్‌ పై దాడి చేసి గిరీష్‌ మెడలో చెప్పుల దండేసి ఊరేగించారు.

Capture

ప్రస్తుత డిజిటల్ యుగంలో యూట్యూబ్ అనేది ఒక ప్రముఖ మీడియా వేదికగా మారింది. అయితే, కంటెంట్ క్రియేషన్ చేస్తుండగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకుంటే లీగల్ ఇష్యూలు, సమాజంలో ప్రతికూల ప్రభావం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.వాస్తవం లేని వార్తలు ప్రసారం చేయకూడదు.వ్యక్తిగతంగా ఎవరినైనా టార్గెట్ చేసి దుష్ప్రచారం చేయకూడదు.తప్పుడు ఆరోపణలు చేస్తే సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంది.మత, కుల, రాజకీయ అంశాలపై ప్రసారం చేయకూడదు.అశ్లీల, హింసాత్మక కంటెంట్‌ను ప్రచారం చేయడం చట్టపరంగా నేరం.సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతమైన ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి.ఇతరులను అవమానించే రీతిలో మాట్లాడకూడదు.బ్యాలెన్స్‌డ్, హుందాతనంతో కూడిన మాటలతో వీడియోలు చేయాలి.

Related Posts
రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
Minister strong warning to registration department employees

తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి సమస్యపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా, ఉద్యోగులు Read more

Chicken Price : ఈరోజు కేజీ చికెన్ ధర ఎంతంటే?
Chickens in market

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో కోడి మాంసం వినియోగం మళ్లీ పెరుగుతోంది. ప్రజలు మళ్లీ నిర్భయంగా చికెన్‌ కొనుగోలు చేయడం ప్రారంభించడంతో Read more

విధ్వంసాలకు బిఆర్ఎస్ కుట్ర
123

ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్హైదరాబాద్ :బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ బంధువుల పార్టీగా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ Read more

భారీ సంఖ్యలో పోకిరీలను అరెస్ట్ చేసిన పోలీసులు
భారీ సంఖ్యలో పోకిరీలను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన నుమాయిష్ జనవరి 3న ప్రారంభమై ఫిబ్రవరి 17తో ముగిసింది. ఈ భారీ ఎగ్జిబిషన్‌ కోటి మందికి పైగా సందర్శకులను ఆకర్షించగా, Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×