టెస్లాపై దాడి చేస్తే 20ఏళ్లు జైలని ట్రంప్ వార్నింగ్

Trump:టెస్లాపై దాడి చేస్తే 20ఏళ్లు జైలని ట్రంప్ వార్నింగ్

అమెరికా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ రూట్ మార్చారు. ఇప్పటివరకూ పూర్తి స్వేచ్ఛనిచ్చిన ట్రంప్‌, తొలిసారి అందుకు భిన్నంగా స్పందించారు. మస్క్‌కు ఉన్న వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఆయనతో అమెరికా యుద్ధ ప్రణాళికలను పంచుకోకూడదని వెల్లడించారు. మస్క్‌కు చైనాలోనూ వ్యాపారాలున్నాయని, కాబట్టి ఆయన ప్రభావితం కావొచ్చని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఓవల్‌ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌ అధికారులు యుద్ధ తంత్రాలకు సంబంధించిన కొన్ని రహస్య ప్రణాళికలను మస్క్‌కు వివరించనున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన కథనం చర్చనీయాంశమైన నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

టెస్లాపై దాడి చేస్తే 20ఏళ్లు జైలని ట్రంప్ వార్నింగ్

చైనాతో యుద్ధం వస్తే ..
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియన్సీ(డోజ్‌) సారథిగా ఉన్న మస్క్‌ శుక్రవారం పెంటగాన్‌కు వెళ్లారని, అక్కడ నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంపై మాత్రమే ఆయన చర్చించారని ట్రంప్‌ వివరించారు. చైనాతో యుద్ధం వస్తే అమెరికా ఎలా ఎదుర్కోవాలో తెలిపే ప్రణాళికలను మస్క్‌కు అధికారులు వివరించలేదని క్లారిటీ ఇచ్చారు. అంతకుముందు పెంటగాన్​కు చేరుకున్న మస్క్​కు అక్కడి అధికారులు స్వాగతం పలికారు. రికి కూడా శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

టెస్లాపై దాడి చేస్తే 20ఏళ్లు జైలు
మరోవైపు ఎలాన్‌ మస్క్​కు చెందిన టెస్లా విద్యుత్‌ కార్ల సంస్థ ఆస్తులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా కార్లపై దాడికి పాల్పడేవారికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేందుకు మంచి అవకాశం ఉందని ట్రంప్‌ వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. ఈ దాడులను ప్రోత్సహిస్తున్న వారికి కూడా శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా, ఇతర దేశాల్లో టెస్లా షోరూమ్‌లు, విద్యుత్‌ ఛార్జింగ్‌ స్టేషన్లతోపాటు కార్ల పైనా ఇటీవల దాడులు జరిగాయి. భద్రత కరవైందన్న కారణంగా కెనడాలో అంతర్జాతీయ వాహన ప్రదర్శన నుంచి టెస్లా తన ఉత్పత్తులను వెనక్కి తీసుకుంది.

Related Posts
sudiksha konanki: సుదీక్ష కోణంకి మిస్సింగ్ కేసులో పోలీసులు ఏం చెబుతున్నారు?
సుదీక్ష కోణంకి మిస్సింగ్ కేసులో పోలీసులు ఏం చెబుతున్నారు?

డొమినికన్ రిపబ్లిక్‌లో కొద్దిరోజుల కిందట అదృశ్యమైన భారతీయ సంతతికి చెందిన సుదీక్ష కోణంకి చనిపోయినట్లు ప్రకటించాలని ఆమె కుటుంబం అక్కడి పోలీసులను కోరింది. అమెరికాలోని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయ Read more

నలుగురు ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేసిన హమాస్
నలుగురు ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేసిన హమాస్2

గాజాలో 15 నెలల యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, దాదాపు 200 మంది పాలస్తీనా ఖైదీలను బదులుగా, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ Read more

విద్యార్థులతో సమావేశమైన నరేంద్ర మోదీ..ఎందుకంటే?
విద్యార్థులతో సమావేశమైన నరేంద్ర మోదీ..

పరీక్షలు ప్రారంభం కావడానికి ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన విద్యార్థులకు ప్రశాంతంగా పరీక్షలు రాయడం ఒత్తిడి లేకుండా ఎలా Read more

మరోసారి రైతులతో సమావేశం:ప్రహ్లాద్‌ జోషి
మరోసారి రైతులతో సమావేశం:ప్రహ్లాద్‌ జోషి

సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకుడు జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఇటీవల నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో, ఆయనతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి చర్చలు జరిపారు. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *