trump

తెలుగింటి ఆడపడుచుపై ట్రంప్ ప్రశంసలు

ఇటీవల అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ట్రంప్ ప్రసంగిస్తూ.. అమెరికా సెకెండ్ లేడీ.. తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకూరిపై ప్రశంసలు కురిపించారు. ‘చాలాకాలంగా నేను జేడీ వాన్స్‌ను చూస్తున్నా. ఓహియో సెనేటర్‌గా పోటీ చేసినప్పుడు ఆయనకు నా మద్దతు తెలిపాను… ఆయన గొప్ప సెనేటర్‌. ఆయన భార్య ఉషా చిలుకూరి చాలా తెలివైన వారు.. కడు నేర్పరి.. వాస్తవానికి ఉపాధ్యక్ష పదవికి ఉషానే ఎంపిక చేయాల్సి ఉంది.. కానీ నిబంధనలు కారణంగా కుదరలేదు.. వాన్స్‌ దంపతులిద్దరూ గొప్పవారు’ అంటూ ట్రంప్‌ పొగడ్తల్లో ముంచెతారు.

అమెరికా నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీమణి ఉషా చిలుకూరి తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మీ చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికాకు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆంధ్రా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ శాంతమ్మకు ఆమె మనవరాలు అవుతారు. ఏరో నాటికల్‌ ఇంజినీరైన రాధాకృష్ణ, బయో కెమిస్ట్రీ రంగ నిపుణురాలైన లక్ష్మి… 1980ల్లోనే అమెరికా వలస వెళ్లారు. వీరి ఇద్దరి పిల్లల్లో ఉష ఒకరు. కాలిఫోర్నియాలోని శాండియాగోలో 1986లో జన్మించిన ఉష.. యేల్‌ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేశారు. కేంబ్రిడ్జి నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్నారు. యేల్‌ వర్సిటీలోని న్యాయ సంబంధ విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. తొలిసారి యేల్ వర్సిటీలోనే ఉషకు వాన్స్‌ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్నేహంగా మారి ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయం ప్రకారం వాన్స్‌ను పెళ్లి చేసుకున్నారు.

Related Posts
దావోస్‌లో భారత్‌కు 20 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు
దావోస్‌లో భారత్‌కు 20 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు

శుక్రవారం ముగిసిన ఐదు రోజుల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సమావేశం ద్వారా భారత్ మొత్తం ₹20 లక్షల కోట్ల రూపాయలకిపైగా పెట్టుబడుల హామీలను పొందినట్లు Read more

1971 డిసెంబర్ 16: భారతదేశం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఘనవిజయం
1971

1971 డిసెంబర్ 16న భారతదేశం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో అద్భుతమైన విజయం సాధించింది. కేవలం 13 రోజుల్లో పాకిస్థాన్‌ను ఓడించి, భారత సైన్యం గొప్ప విజయాన్ని నమోదు Read more

ట్రంప్ విజయంపై మోదీ అభినందన…
modi

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని సాధించటంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అతని మిత్రుడు ట్రంప్‌ను అభినందించారు. ఈ విజయాన్ని “చారిత్రకమైనది” Read more

భారీ ఎన్‌కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి
Huge encounter.. 11 Maoists killed

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో భ‌ద్రతా బ‌ల‌గాలు బుల్లెట్ల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *