trump

తెలుగింటి ఆడపడుచుపై ట్రంప్ ప్రశంసలు

ఇటీవల అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ట్రంప్ ప్రసంగిస్తూ.. అమెరికా సెకెండ్ లేడీ.. తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకూరిపై ప్రశంసలు కురిపించారు. ‘చాలాకాలంగా నేను జేడీ వాన్స్‌ను చూస్తున్నా. ఓహియో సెనేటర్‌గా పోటీ చేసినప్పుడు ఆయనకు నా మద్దతు తెలిపాను… ఆయన గొప్ప సెనేటర్‌. ఆయన భార్య ఉషా చిలుకూరి చాలా తెలివైన వారు.. కడు నేర్పరి.. వాస్తవానికి ఉపాధ్యక్ష పదవికి ఉషానే ఎంపిక చేయాల్సి ఉంది.. కానీ నిబంధనలు కారణంగా కుదరలేదు.. వాన్స్‌ దంపతులిద్దరూ గొప్పవారు’ అంటూ ట్రంప్‌ పొగడ్తల్లో ముంచెతారు.

అమెరికా నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీమణి ఉషా చిలుకూరి తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మీ చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికాకు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆంధ్రా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ శాంతమ్మకు ఆమె మనవరాలు అవుతారు. ఏరో నాటికల్‌ ఇంజినీరైన రాధాకృష్ణ, బయో కెమిస్ట్రీ రంగ నిపుణురాలైన లక్ష్మి… 1980ల్లోనే అమెరికా వలస వెళ్లారు. వీరి ఇద్దరి పిల్లల్లో ఉష ఒకరు. కాలిఫోర్నియాలోని శాండియాగోలో 1986లో జన్మించిన ఉష.. యేల్‌ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేశారు. కేంబ్రిడ్జి నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్నారు. యేల్‌ వర్సిటీలోని న్యాయ సంబంధ విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. తొలిసారి యేల్ వర్సిటీలోనే ఉషకు వాన్స్‌ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్నేహంగా మారి ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయం ప్రకారం వాన్స్‌ను పెళ్లి చేసుకున్నారు.

Related Posts
బోరుబావిలో చిన్నారి: శ్రమిస్తున్న అధికారులు
boy

రాజస్థాన్: డిసెంబర్ 11, పెద్దల నిర్లక్ష్యంతో పసి పిల్లల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. నీటి కోసం పొలాల్లో బోరుబావులు గోతులు తీసి నీరు పడకపోతే మల్లి వాటిని Read more

అదానీకి ఒక్క రోజులో రూ.61,192 కోట్లు లాభం
gautam adani

ప్రముఖ వ్యాపారవేత్త అదానీ సంపద కేవలం మంగళవారం ఒక్కరోజునే రూ.61,192 కోట్లు పెరిగింది. అదానీ గ్రూప్ ప్రస్తుతం దేశంలో అనేక కీలక రంగాల్లో వ్యాపారాలను కలిగి ఉంది. Read more

Virat Kohli :మైదానంలోని తన వ్యక్తిత్వంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన విరాట్ కోహ్లీ
Virat Kohli :మైదానంలోని తన వ్యక్తిత్వంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తన మైదానంలోని వ్యక్తిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన అగ్రెసివ్ స్వభావాన్ని విమర్శించినవారు, ఇప్పుడు తన ప్రశాంతతను సమస్యగా Read more

పాక్‌లో మారణహోమం
jaffar express hijack

పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ కావడం దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలను రేకెత్తించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) తిరుగుబాటుదారులు ఈ ఘటనకు పాల్పడ్డారు. హైజాక్ అనంతరం పాకిస్తాన్ Read more