Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వచ్చేరెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు

Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వచ్చేరెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ఎండలు, వడగాలులు, అకాల వర్షాలు, పిడుగులు ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువవుతున్నప్పటికీ, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురవడానికి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగుల పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Advertisements

అధిక ఉష్ణోగ్రత

శనివారం రాత్రి 8 గంటల సమయం లో కాకినాడ జిల్లా వేలంకలో 56.2 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. ఏలేశ్వరంలో 48.5, కోటనందూరులో 45.2, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 44.5 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో కనిష్టంగా 20 మిల్లీ మీటర్ల వరకు వర్షపాతం రికార్డు అయ్యింది. అనకాపల్లి జిల్లా లో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల గోపవరం, శ్రీకాకుళం పొందూరులో 39.7 డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చుకుంటే ఇది రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. వర్షాల వల్ల ఎండ తీవ్రత కొంత తగ్గినట్టయింది. నేడు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. కాకినాడ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడొచ్చని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మరోవైపు ఎండ తీవ్రత కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

 Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వచ్చేరెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు

ఈదురుగాలులతో వర్షాలు

పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. వ్యవసాయ పనుల్లో ఉన్నవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.మహారాష్ట్ర నుండి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది.సోమవారం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం,ఈ మేరకు తెలంగాణలోని పది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు.

Related Posts
అయ్యప్ప భక్తుల కోసం IRCTC రైలు
Sabarimala Yatra

IRCTC తొలిసారిగా అయ్యప్ప భక్తుల కోసం భారత్ గౌరవ్ రైలును ప్రవేశపెట్టింది. ఈ రైలు శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలను సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని Read more

సర్వనాశనం అయిపోతారు అంటూ ప్రభుత్వంపై చిన్ని కృష్ణ కీలక వ్యాఖ్యలు
chinnikrishna alluarjun

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ ఆ తర్వాత విడుదల కావడం పట్ల గంగోత్రి సినిమా రచయిత చిన్నికృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్లు Read more

రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. చర్చకు రెడీ : కిషన్ రెడ్డి
Kishan Reddy accepted Revanth Reddy challenge

ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదు హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. Read more

America : జనాభా పెంపుకు $5,000 బేబీ బోనస్ ప్రణాళిక
America : జనాభా పెంపుకు $5,000 బేబీ బోనస్ ప్రణాళిక

అమెరికాలో జననాల రేటు తగ్గుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ట్రంప్ ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×