Tet hall tickets released

టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ విద్యాశాఖ టెట్ హాల్ టికెట్లను విడుదల చేసింది. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ టీజీ టెట్‌ 2025 పరీక్షలు జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. జనవరి 20వ తేదీతో ముగుస్తాయి. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. TS TET Hall Ticket 2024 విడుదలయ్యాక ఈ డైరెక్ట్‌ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ టెట్‌ పేపర్‌–1ను ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలు– 150 మార్కులకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి (30 ప్రశ్నలు– 30 మార్కులు), లాంగ్వేజ్‌–1 (30 ప్రశ్నలు– 30 మార్కులు), లాంగ్వేజ్‌–2 (30 ప్రశ్నలు– 30 మార్కులు), మ్యాథమెటిక్స్‌ (30 ప్రశ్నలు– 30 మార్కులు), ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ (30 ప్రశ్నలు – 30 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో 6 ప్రశ్నలు పెడగాజీ నుంచి ఉంటాయి.

కాగా, విద్యాశాఖ ఇప్పటికే ప్ర‌క‌టించిన టీజీ టెట్‌ పూర్తిస్థాయి షెడ్యూల్ ప్ర‌కారం.. వ‌చ్చే సంవ‌త్స‌రం 2025 జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ టీజీ టెట్‌ సిలబస్‌ కూడా విడుదల చేసింది.

Related Posts
మామ సినిమా కోసం రంగంలోకి దిగుతున్న అల్లుడు
lokesh dakumaharaj

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న 'డాకు మహారాజ్' సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి 2025 కి రాబోతున్న Read more

హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్
AICC Secretary Meenakshi Natarajan reached Hyderabad

మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్‌: ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్‌ రాష్ట్రానికి వచ్చారు. సాదాసీదాగా Read more

వారికి రైతు భరోసా ఇవ్వం తేల్చేసిన మంత్రి పొంగులేటి
Ponguleti Srinivasa Reddy

రైతు భరోసా పథకం అమలులో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని పాటిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతులకు ఉపశమనం కలిగించే ఈ పథకం, భూమి యోగ్యత Read more

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన..
modi putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన గురించి క్రెమ్లిన్ ప్రెస్ కార్యదర్శి డిమిత్రి పెస్కోవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం, పుతిన్ పర్యటనకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *