Tet hall tickets released

టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ విద్యాశాఖ టెట్ హాల్ టికెట్లను విడుదల చేసింది. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ టీజీ టెట్‌ 2025 పరీక్షలు జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. జనవరి 20వ తేదీతో ముగుస్తాయి. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. TS TET Hall Ticket 2024 విడుదలయ్యాక ఈ డైరెక్ట్‌ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ టెట్‌ పేపర్‌–1ను ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలు– 150 మార్కులకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి (30 ప్రశ్నలు– 30 మార్కులు), లాంగ్వేజ్‌–1 (30 ప్రశ్నలు– 30 మార్కులు), లాంగ్వేజ్‌–2 (30 ప్రశ్నలు– 30 మార్కులు), మ్యాథమెటిక్స్‌ (30 ప్రశ్నలు– 30 మార్కులు), ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ (30 ప్రశ్నలు – 30 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో 6 ప్రశ్నలు పెడగాజీ నుంచి ఉంటాయి.

కాగా, విద్యాశాఖ ఇప్పటికే ప్ర‌క‌టించిన టీజీ టెట్‌ పూర్తిస్థాయి షెడ్యూల్ ప్ర‌కారం.. వ‌చ్చే సంవ‌త్స‌రం 2025 జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ టీజీ టెట్‌ సిలబస్‌ కూడా విడుదల చేసింది.

Related Posts
కలెక్టరేట్‌లో రమ్మీ ఆడిన రెవెన్యూ అధికారి.. !
Revenue officer who played rummy in collectorate.

అమరావతి: కీలక సమావేశంలో అనంతపురం డిఆర్ఓ మాలోల రమ్మీ గేమ్ ఆడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ లో వేది కపై Read more

క్వాలీజీల్ అత్యాధునిక సమర్ధత కేంద్రం
QualiZeel Launches 3rd State of the Art Competence Center in Hyderabad

హైదరాబాద్ : క్వాలిటీ ఇంజనీరింగ్ మరియు డిజిటల్ పరివర్తన సేవలలో అంతర్జాతీయంగా అగ్రగామి అయిన క్వాలీజీల్ , హైదరాబాద్‌లో తమ కొత్త సమర్ధత కేంద్రంను ప్రారంభించినట్లు వెల్లడించింది. Read more

ఎన్నికల సంఘంపై మండిపడ్డ కాంగ్రెస్
ఎన్నికల సంఘంపై మండిపడ్డ కాంగ్రెస్

ఎన్నికల సంఘంపై మండిపడ్డ కాంగ్రెస్, పారదర్శకత తగ్గిపోవడం పై తీవ్ర విమర్శలు భారత ప్రభుత్వం కొన్ని ఎన్నికల నియమాలలో మార్పులు చేర్చింది, దీనివల్ల పబ్లిక్‌కు కొన్ని ఎలక్ట్రానిక్ Read more

క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం
క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్సి) అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి జనవరి 2 న ప్రారంభించిన నిరాహార దీక్షలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం క్షీణించడంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *