ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో భారీగా తగ్గిన రొయ్యల ధరలు

Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో భారీగా తగ్గిన రొయ్యల ధరలు

భారత్‌పై అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగంపై కనిపిస్తోంది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా 27 శాతం సుంకాలు విధించింది. దీనివల్ల ఏపీలోని ఆక్వారంగం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రొయ్యల సాగు అధికంగా ఉండే భీమవరం ప్రాంతంలో కిలో రొయ్యల ధర 40 రూపాయలు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికాకు చేపలు, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. తూర్పు గోదావరి జిల్లా మత్స్యశాఖ అధికారుల వివరాల ప్రకారం భారతదేశం నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికా 27% సుంకం విధించింది. ఇప్పటికే భారతదేశ రొయ్యలపై అమెరికా యాంటీ డంపింగ్‌ డ్యూటీతో పాటు, 5.7% కౌంటర్‌ వయలింగ్‌ సుంకం (సీవీడీ) వసూలు చేస్తోంది. ఈ సుంకాలన్నీ కలుపుకుంటే దాదాపు 35 శాతానికి పైగానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

Advertisements
ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో భారీగా తగ్గిన రొయ్యల ధరలు

‘లక్షలో సగం పన్నులు, ఖర్చులకే’
తాజా సుంకాలను కలుపుకుంటే లక్ష రూపాయల విలువ చేసే రొయ్యలను ఎగుమతి చేయాలంటే ఇప్పుడు రూ.26,000 సుంకం చెల్లించాలి. యాంటీ డంపింగ్‌ డ్యూటీ, కౌంటర్‌ వయోలిన్‌ డ్యూటీ కూడా కలిపితే రూ.35 వేలకు పైగా కట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి రవాణా, ప్యాకింగ్‌ ఖర్చులు అదనం. లక్ష రూపాయల్లో సగం ఈ పన్నులు, రవాణా ఖర్చులకే పోతోందని కొందరు రైతులు చెప్పారు.
”నేను ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాను. తీరా సోమవారం రొయ్య పట్టిన తర్వాత మార్కెట్‌కి ఫోన్‌ చేస్తే వంద కౌంట్‌కి 40 రూపాయలు తగ్గిందని చెప్పారు. అదేమంటే అమెరికాలో తగ్గించారని చెప్పారు. అమెరికా సుంకం ప్రభావంతో గత వారం నుంచి రొయ్యల ధరలు తగ్గిపోయాయని రైతులు చెబుతుంటే మార్కెట్‌లో రొయ్యలు అమ్ముకునే చిరు వ్యాపారులు మాత్రం ధర తగ్గినా తమకు పెద్దగా బేరాలు లేవని అంటున్నారు.

READ ALSO: Donald Trump: చైనాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. 104%కి పెంపు

Related Posts
హైదరాబాద్‌లో ముజిగల్‌ మ్యూజిక్‌ అకాడమీ
Muzhigal Music Academy in Hyderabad

కామాక్షి అంబటిపూడి ( ఇండియన్ ఐడెల్ గాయని) ప్రారంభించారు. వ్యవస్థీకృత సంగీత పరిశ్రమలో సుప్రసిద్ధ సంస్థగా తమను తాము నిలుపుకునేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న ముజిగల్‌, తమ కార్యకలాపాలను Read more

Chinese Army : పాకిస్థాన్లో చైనా ఆర్మీ..!
Chinese Army in Pakistan

పాకిస్థాన్‌లో చైనా ఆర్మీ, ప్రైవేట్ భద్రతా దళాలను మోహరించేలా కొత్త ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC) ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనా కార్మికులు, ఇంజినీర్ల Read more

శంషాబాద్‌లో వైష్ణోయ్ సౌత్‌వుడ్స్‌ను ఆవిష్కరించిన వైష్ణోయ్ గ్రూప్
Vaishnoi Group Launches Vai

హైదరాబాద్, నవంబర్ 15, 2024 - శంషాబాద్‌లోని మామిడిపల్లిలో ప్రత్యేక విల్లా కమ్యూనిటీ వైష్ణోయ్ సౌత్‌ వుడ్స్‌ను ప్రారంభించినట్లు వైష్ణోయ్ గ్రూప్ సగర్వంగా ప్రకటించింది. ఈ గ్రాండ్ Read more

Investment: కూతురి స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టని బిల్ గేట్స్
Investment: కూతురి స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టని బిల్ గేట్స్

ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కుమార్తె ఫోబ్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×