Ponnam Prabhakar: కేటీఆర్‌పై మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు

Ponnam Prabhakar: కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో కంచ గచ్చిబౌలి భూముల వివాదం రాజకీయంగా మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా, తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ వాటిపై ఘాటుగా స్పందించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు.

Advertisements

పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ

పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టారు. కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థం కాదు. వాస్తవాలు తెలియకుండానే గాలికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పారదర్శకంగా ఉన్నాయి, అని వ్యాఖ్యానించారు. మంత్రి పొన్నం ఎద్దేవా చేస్తూ, కేటీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. కానీ ప్రజలు అధికారాన్ని ఎవరికీ అప్పగించాలో బాగా తెలుసు. ప్రజల నాడి తెలుసుకోలేని బీఆర్ఎస్ నేతలకు భవిష్యత్తు లేదు, అని చెప్పారు. గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని బీజేపీ ఎంపీ అజ్ఞాతంగా నడిపిస్తున్నారని కేటీఆర్ చేసిన ఆరోపణలపై మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. ఆ ఎంపీ పేరు చెప్పే దమ్ము, ధైర్యం లేదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ నేతలు అవివేకంతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం విమర్శించారు. సీఎం మార్పుపై ప్రకటనలు చేస్తూ వారి అవివేకాన్ని బయటపెట్టుకుంటున్నారని అన్నారు. ఒకవేళ సీఎంను మార్చాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇ‌న్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ ఎప్పుడో ప్రకటన చేసేవారని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కానీ ఇవన్నీ ప్రచార గోలే తప్ప నిజం కాదు, అని అన్నారు. పట్టణాభివృద్ధి, పౌరసదుపాయాలు, భూ వినియోగంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. అయితే ప్రతిపక్షాలకి ఇది జీర్ణించుకోలేని విషయం,” అని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన స్పందన రాజకీయ వేడి పెంచేలా ఉంది.

Read also: Revanth Reddy : భూభారతిపై రేవంత్ రెడ్డి సమీక్ష!

Related Posts
Job Mela : 3 నెలలకోసారి జాబ్ మేళాలు – సీఎం చంద్రబాబు
కలెక్టర్ సదస్సులో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి Read more

ఏపీకి తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు
ఏపీకి తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఇటీవల వరకు రాష్ట్రంలోని Read more

మోనాలిసా ను కలవబోతున్న డైరెక్టర్.
మోనాలిసా ను కలవబోతున్న డైరెక్టర్

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కాటుక పెట్టిన తేనె కళ్లు, డస్కీ స్కీన్, అందమైన చిరునవ్వు—ఇలాంటి లుక్‌తో Read more

తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: గిరిజ‌నుల‌కు సీఎం సూచ‌న‌
Don't believe false propaganda.. CM advises tribals

గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటూ చంద్ర‌బాబు ట్వీట్‌ అమరావతి: గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వారి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×