Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడని… సెటైర్లు పేల్చారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని ఆమె వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించడమేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

ఆయన చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా
దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారని చురకలాంటించారు. చేగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి అప్పుడు రైటిస్ట్ ఎలా అయ్యారు అంటూ ఆగ్రహించారు. ఆయన చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధం గా ఉంటాయని మండి పడ్డారు. రేపు తమిళనాడు వెళ్లి హిందీ చేయబోమనైన ఆయన చెప్పవచ్చు అంటూ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.
కవిత కామెంట్స్ పై జనసేన నేతలు విమర్శలు
పార్టీ పెట్టిన 15 ఏళ్లకు పవన్ ఎమ్మెల్యే అయ్యారని.. వైసీపీ మినహా దాదాపు ఏపీలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని కవిత అన్నారు. అయితే కవిత కామెంట్స్ పై జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఊతికారేస్తున్నారు. కవితకు ఏ అర్హత ఉందని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. గతంలో లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టైన విషయాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి స్కామ్ లు చేస్తేనే సీరియస్ పొలిటీషియన్ అన్నట్లా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.