Pakistan should give up terrorism now.. Jammu and Kashmir Deputy CM

Surinder Choudhary : పాకిస్థాన్‌ ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని వదులుకోవాలి: జమ్మూకశ్మీర్‌ డిప్యూటీ సీఎం

Surinder Choudhary : పాకిస్థాన్ ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని వదులుకోవాలని జమ్మూకశ్మీర్‌ డిప్యూటీ సీఎం సురీందర్‌ చౌధరీ హితవు పలికారు. మూడు దశాబ్దాలుగా అక్కడ ఉన్న ఉగ్రవాదం అంతమై మంచి పరిస్థితులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉగ్రచర్యలకు భారత్‌ లొంగదని పాకిస్థాన్‌ గుర్తుపెట్టుకోవాలి. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల తనకు తానుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటోంది అని సురీందర్‌ చౌధరీ అన్నారు. సరిహద్దు అవతల పన్నుతున్న కుట్రల వల్ల తమ పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని సురీందర్‌ చౌధరీ ఆవేదన వ్యక్తం చేశారు. హింసతో ఏమీ సాధించలేమనే విషయాన్నిపాకిస్థాన్‌ తెలుసుకొవాలని అన్నారు.

పాకిస్థాన్‌ ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని వదులుకోవాలి

గత 30ఏళ్లుగా మనపై దాడులు

కేంద్ర, ప్రభుత్వం కానీ, జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం కానీ మన పిల్లల బలిదానాలను ఎప్పటికీ కోరుకోవు. సరిహద్దు అవతల పన్నుతున్న కుట్రల కారణంగానే వారు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 30ఏళ్లుగా మనపై దాడులు చేస్తున్నా వారు ఏమీ సాధించలేదన్నారు. కథువా జిల్లాలోని సఫియాన్ అడవిలో ఉగ్రవాదులతో రెండు రోజుల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం)తో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, ఒక డీఎస్పీతో పాటు నలుగురు సైనికులు గాయపడ్డారు. ఈ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతోంది. మృతిచెందిన పోలీసులకు నివాళులర్పించిన అనంతరం సురీందర్‌ మాట్లాడుతూ..ఈ వ్యాఖ్యలు చేశారు.

Related Posts
అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో దాడి
Amritsar Golden Temple

పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేయడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడగా, Read more

DEI వ్యతిరేక ప్రతిపాదనను తిరస్కరించిన ఆపిల్
DEI వ్యతిరేక ప్రతిపాదనను తిరస్కరించిన ఆపిల్

ఆపిల్ కంపెనీలో వైవిధ్యం, సమానత్వం, చేరిక (DEI - Diversity, Equity, Inclusion) కార్యక్రమాలను రద్దు చేయాలనే ప్రతిపాదనను వాటాదారులు తిరస్కరించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని Read more

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం
Today is Rekha Gupta swearing in ceremony as the Chief Minister of Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ అనూహ్యంగా ఎంపిక చేసింది. నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం.26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం Read more

బాంబు బెదిరింపులు..సికింద్రాబాద్‌లోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వద్ద బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు
Bomb threats.Bomb squad checks at CRPF school in Secunderabad

హైదరాబాద్‌: ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు సోమవారం అర్ధరాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో సికింద్రాబాద్ జవహర్‌ నగర్‌ పరిధిలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *